కొత్త కథలతో రానున్న రాజ్ తరుణ్
- February 21, 2017 / 01:41 PM ISTByFilmy Focus
సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన యువ హీరోల మధ్య దూసుకువచ్చిన నటుడు రాజ్ తరుణ్. ఉయ్యాలా జంపాల సినిమాతో లాంచ్ అయి.. సినిమా చూపిస్తా మామ, కుమారి 21 ఎఫ్ చిత్రాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఆడో రకం, ఈడో రకం తో హిట్ ట్రాక్ లోకి వచ్చారు. ఆ తర్వాత ఏమైంది ఏమో తెలియదు కానీ మజ్ను, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్ చిత్రాల్లో స్పెషల్ అప్పీరియన్స్ కే పరిమితమయ్యారు. తాజాగా “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” అనే మూవీతో రాబోతున్నారు. ఈ చిత్రం మార్చి మూడవ తేదీన రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన రాజ్ తరుణ్ ఇక నుంచి మెయిన్ ట్రాక్ లోనే ఉంటానని చెప్పారు. చిత్రాలు చేయడంలో ఆలస్యం చేయనని చెప్పారు.
“నేను లోకల్, శతమానం భవతి వంటి మంచి కథలను రిజక్ట్ చేసానని అందరూ అనుకుంటున్నారు. అయితే వాటిని నేను వదులుకోలేదు. నేను లోకల్ మూవీ చేయాలనీ అనుకునేలోపు నాని కి వెళ్ళింది. ఇక శతమానం భవతి కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయాను” అని తనపై వచ్చిన రూమర్లపై క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి ఆ పొరపాట్లు జరగవని, కిట్టు ఉన్నాడు జాగ్రత్త తర్వాత అందగాడు సినిమాతో పలకరిస్తానని వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















