మణిరత్నం తో మెగా హీరో….కన్ఫర్మ్ అయినట్లేనా?
- May 22, 2017 / 07:26 AM ISTByFilmy Focus
ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు మన చెర్రీ. అయితే అదలా ఉంటే తాజాగా తమిళ కధతో ధృవ అంటూ మంచి హిట్ అందుకున్నాడు . ఆ సినిమాకు ముందు చెర్రీ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడగా, మెల్లగా మళ్లీ హిట్ ట్ర్యాక్ అందుకున్నాడు యువహీరో. అయితే ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తరువాత చెర్రీ ఏ సినిమా చేస్తాడు? అసలు ఏ దర్శకుడితో చెర్రీ సినిమా ఉంటుంది అంటే, వస్తున్న వార్తలు వింటున్నా మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. ఈ వార్త నిజం అయితే చెర్రీ ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయం అంటున్నారు. అసలు మాటర్ ఏంటి అంటే. సుకుమార్ తో సినిమా తర్వాత రాం చరణ్ మణిరత్నంతో సినిమా చేస్తాడని టాక్.
అయితే మణిరత్నం రీసెంట్ మూవీ చెలియా ఫ్లాప్ తర్వాత అతనితో సినిమా చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. కాని ఇచ్చిన మాట కోసం చెర్రి మాత్రం మణిరత్నంతో సినిమా చేస్తున్నాడట. రీసెంట్ గా ఫైనల్ స్క్రిప్ట్ వినిపించగా చెర్రి ఆ స్టోరీ నేరేషన్ కు ఫ్లాట్ అయ్యాడని అంటున్నారు. ఫుల్ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తే ఇక సినిమా చేసేయడమే అన్నాడట రాం చరణ్. ఈ సినిమాకు టైటిల్ గా యోధ అని పెట్టబోతున్నారట. సుకుమార్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి త్వరలోనే మణిరత్నం మూవీకి ముహుర్తం పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉంటే మణిరత్నంకి సినిమాల్లో మ్యాటర్ తగ్గింది అని, ఇప్పుడు ఆయన డైరెక్షన్ అంత వర్కౌట్ కాదు అని చెర్రీ అతనితో సినిమా చేస్తే ఇబ్బందులు తప్పవు అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అసలే ఔట్ డేటెడ్ డైరెక్టర్ ఏమాత్రం తేడా వచ్చినా , చెర్రీ ఫేమ్ కి ఇబ్బంది తప్పదు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















