వరుణ్ తేజ్ కథను చేయనున్న రామ్ చరణ్ తేజ్
- January 23, 2017 / 09:09 AM ISTByFilmy Focus
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగానూ, నిర్మాతగానూ విజయాలను అందుకోవడంతో ఎంతో ఆనందంగా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ గా నటించిన ధృవ సినిమా హిట్ సాధించడంతో ఉత్సాహంగా మరో మూవీని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. సూపర్ స్క్రీన్ ప్లే తో అదరగొట్టే డైరక్టర్ సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. చెర్రీ గ్రామీణ కుర్రోడిగా కనిపించనున్న ఈ మూవీ జనవరి 30వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. దీని తర్వాత చరణ్ చేయనున్న ఫిలిం ని కూడా ఫిక్స్ చేశారు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన క్రిష్ డైరక్షన్ లో నటించేందుకు ఒకే చెప్పారు.
ఈ మూవీలో తాను స్పై ఏజెంట్ గా కనిపించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ స్టోరీ వరుణ్ తేజ్ కోసం క్రిష్ రాసుకున్నారు. రాయబారి అనే టైటిల్ ని కూడా అనుకున్నారు. కానీ చివరి నిముషంలో ఈ మూవీ క్యాన్సల్ అయింది. అదే కథను చరణ్ చేయడానికి అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే చెర్రీ కోసం కథలో కొన్ని మార్పులు చేసే పనిలో క్రిష్ ఉన్నారని తెలిసింది. సుకుమార్ సినిమా అనంతరం క్రిష్ కలయికలో చరణ్ మూవీ మొదలుకానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















