RTC Cross Roads: మరో మల్టీప్లెక్స్.. సింగిల్ స్క్రీన్స్ వైబ్ మిస్ అయినట్లే..
- February 5, 2026 / 05:43 PM ISTByFilmy Focus Writer
హైదరాబాద్ సినిమా హిస్టరీలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్కు ఒక స్పెషల్ పేజీ ఉంటుంది. ఇక్కడి థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసే రచ్చ, ఆ కటౌట్లు, ఈలలు.. ఆ వైబే వేరు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. దశాబ్దాలుగా సింగిల్ స్క్రీన్స్కు అడ్డాగా ఉన్న ఈ ఏరియాలో మల్టీప్లెక్స్ కల్చర్ స్పీడ్ అందుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ, లగ్జరీ కోరుకునే నేటి తరం ఆడియన్స్ కోసం ఈ వింటేజ్ అడ్డా ఇప్పుడు సరికొత్త హంగులు అద్దుకుంటోంది.
RTC Cross Roads
ఈ మార్పుకు మెయిన్ సెంటర్ పాయింట్ చిక్కడపల్లిలోని ఓడియన్ మాల్. ఇక్కడ రీసెంట్గా ఐనాక్స్ మల్టీప్లెక్స్ గ్రాండ్గా ఓపెన్ అయింది. ఏకంగా 8 స్క్రీన్స్తో అందుబాటులోకి వచ్చిన ఈ థియేటర్ మల్టీప్లెక్స్ లవర్స్కు ఫుల్ మీల్స్ లాంటిది. ఇది చాలదన్నట్లు త్వరలోనే AMB సినిమాస్ కూడా ఇక్కడికి రాబోతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. దీనివల్ల ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న క్రాస్ రోడ్స్, ఇప్పుడు మల్టీప్లెక్స్ హబ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది.
మల్టీప్లెక్స్ అంటేనే మెయిన్ హైలైట్ అక్కడి కంఫర్ట్. 4K ప్రొజెక్షన్, అదిరిపోయే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్, విలాసవంతమైన రిక్లైనర్ సీట్లు.. ఇలా వరల్డ్ క్లాస్ ఫీచర్స్ ఇక్కడ అందుబాటులోకి వచ్చాయి. షాపింగ్ మాల్లోనే సినిమా ఉండటం వల్ల యూత్కు ఇది ఒక పర్ఫెక్ట్ హ్యాంగ్ అవుట్ స్పాట్గా మారుతోంది. కేవలం సినిమా మాత్రమే కాదు, అక్కడి ఫుడ్ కోర్టులు కూడా నయా ఎక్స్పీరియన్స్ను ఇస్తున్నాయి. దీంతో జనాలు ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కంటే ఇక్కడికే మొగ్గు చూపుతున్నారు.
అయితే ఈ మల్టీప్లెక్స్ మేనియా వల్ల సంధ్య, సుదర్శన్ లాంటి లెజెండరీ సింగిల్ స్క్రీన్స్ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పక్కనే అత్యాధునిక సదుపాయాలతో థియేటర్లు ఉంటే, పాత థియేటర్లకు ఆడియన్స్ ఎంతవరకు వస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇప్పటికే సిటీలో చాలా సింగిల్ స్క్రీన్స్ మూతపడి మాల్స్గా మారిపోతున్నాయి. ఒకవేళ క్రాస్ రోడ్స్లో కూడా ఇదే జరిగితే, ఆ మాస్ గోల, పేపర్ ముక్కల సందడి లాంటి లోకల్ వైబ్ మిస్ అవుతామని పాత తరం సినీ ప్రేమికులు ఫీలవుతున్నారు.














