సాయి ధరమ్ తేజ్ ఫైనలైజ్ చేసిన స్క్రిప్ట్..!

Advertisement

‘సుప్రీమ్’ చిత్రంతో ఇటీవలే మరో విజయాన్ని అందుకున్న సాయి ధరమ్ తేజ్.. ప్రస్తుతం సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తిక్క’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే సాయి గోపీచంద్ మలినేని తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

ఈ చిత్ర కథాంశంలోని రెండవ అర్థ భాగం సాయికి నచ్చక పోవడంతో సాయి ఈ చిత్రం నుంచి తప్పుకున్నాడని వార్తలు విన రాగా.. ఈ చిత్రం ఆగిపోలేదని గోపీచంద్ క్లారిటీ ఇచ్చాడు. తాజా సమాచారం ప్రకారం.. సాయి సూచన మేరకు స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేశారని.. దాంతో త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. మరోవైపు సాయి ధరమ్ తేజ్బి‌ వి‌ఎస్ రవి దర్శకత్వంలోనూ నటించనున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read