ఆ వార్తల్లో వాస్తవం ఉందన్న సమంత
- August 4, 2017 / 06:38 AM ISTByFilmy Focus
టాలీవుడ్ క్యూట్ బ్యూటీ సమంత బిజీ బిజీగా ఉంది. అక్టోబర్ ఆరవ తేదీన నాగ చైతన్యను పెళ్లి చేసుకోనుంది. ఆ పెళ్లి పనులతో పాటు, పెళ్లి నాటికి చేతిలో ఉన్న ఆరు సినిమాలను కంప్లీట్ చేయడానికి తీరిక లేకుండా శ్రమిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఆమెపై ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. నిర్మాతగా అవతారం ఎత్తనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది. ఒక మలయాళ చిత్ర రీమేక్ హక్కులను సమంత కొనుగోలు చేశారని, దానిని తమిళం, తెలుగు భాషల్లో నిర్మించి, నటించనున్నారనే కథనాలు వచ్చాయి.
దీనిపై సమంత స్పందించింది. చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నట్లు స్పష్టం చేసింది. ఎస్వీఎస్ పార్టనర్స్ ఎల్ఎల్పీ అనే బ్యానర్ను కూడా స్థాపించనున్నట్లు ట్విట్టర్ వేదికపై వెల్లడించింది. దీంతో ఈ విషయంపై అందరికీ క్లారిటీ వచ్చింది. పెళ్లి తర్వాత నటిగా కాకుండా, నిర్మాతగా సమంత బిజీ కానున్నట్లు అర్ధమవుతోంది. మామ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో మంచి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అదే బాటలో కోడలు కూడా వెళుతుండడం విశేషం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















