Samantha: మొక్కు తీర్చుకోవడానికి రిస్క్‌ చేసిన సమంత… నెటిజన్లు ఫిదా!

  • February 17, 2023 / 11:27 AM IST

అనారోగ్యం పాలైన తర్వాత సమంతలో చాలామార్పులొచ్చాయి. గతంలో చూసిన సమంత, ఇప్పటి సమంత వేరు అని సన్నిహితులు, అభిమానులు చెబుతున్నారు. నాగచైతన్య నుండి వేరుపడిన తర్వాత సమంతలో మార్పులు కనిపించినా.. అప్పుడు అవి అగ్రెసివ్‌గా ఉండేవి. అయితే ఇప్పుడు మార్పులు ఆమె దైవచింతన, భక్తిమార్గం వైపు తీసుకొచ్చాయి. ఒక కార్యక్రమం కోసం బయటకు వచ్చినప్పుడు జపమాలతో కనిపించిన సామ్‌.. ఇప్పుడు ఆలయాల సందర్శనకు వెళ్లింది. ఈ మేరకు ఫొటోలు వైరల్‌ అయ్యాయి.

సమంత ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారనే విషయం ఆమెను క్లోజ్‌గా ఫాలో అయ్యేవాళ్లకు తెలిసిన విషయమే. తాజాగా ఆమె తమిళనాడులోని పళని మురుగన్‌ ఆలయాన్ని సందర్శించారు. అయితే దేవుని దర్శనం కోసం ఆమె ఎంచుకున్న మార్గమే ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ దేవాలయంలో ఉన్న 600 మెట్లపై హారతి కర్పూరం వెలిగించి ఆ తర్వాత స్వామి వారి దర్శనం చేసుకున్నారట. అంటే ఒక్కో మెట్టు మీద ఒక్కో కర్పూరం వెలిగించి ఒక్కో మెట్టు ఎక్కారు.

ఈ మేరకు కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మయోసైటిస్‌ రుగ్మత నుండి కోలుకుంటున్న సమంత ప్రస్తుతం మానసిక ప్రశాంతత కోసం వివిధ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే మురుగన్‌ దేవాలయానికి వెళ్లారని సమాచారం. ఇంతకుముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా ఆమె సందర్శించారు. దానికి సంబంధించిన ఫొటోలూ ఇలానే సోషల్‌ మీడియాలో కనిపించాయి.

ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ‘ఖుషి’ షూటింగ్‌ మధ్యలో ఆగిపోయింది. మరోవైపు హిందీ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ షూటింగ్‌ ఇటీవల మొదలైంది. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో, లెక్కల దశలో ఉన్నాయి అని సమాచారం. ఇవన్నీ చూసుకుంటేనే సమంత తన ఆరోగ్యం కోసం ఇలా పూజలు చేస్తోంది. అలాగే జిమ్‌లో కూడా కసరత్తులు చేస్తోంది సమంత.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus