Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
- June 20, 2026 / 01:03 PM ISTByPhani Kumar
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) సినిమా నిన్న అంటే జూన్ 19న విడుదలైంది. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు. సమంత (Samantha) అభిమానులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మిగతా ఆడియన్స్ నుండీ కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్స్ పై ఎటువంటి ప్రభావం పడటం లేదు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘మా ఇంటి బంగారం’ లో సమంత పెర్ఫార్మన్స్ కి ఏ రేంజ్ అప్లాజ్ వస్తుందో.. ఆమె స్నేహితురాలుగా చేసిన కిరణ్మయి పాత్రకి కూడా అదే రేంజ్లో అప్లాజ్ వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి.
Manjusha Mukkavilli
ట్రైలర్లో కూడా ‘లెట్స్ కమాన్’ అంటూ ఆమె చెప్పిన హైలెట్ అయ్యింది. సినిమాలో ఆమె చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. దీంతో ఆ నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంటూ నెటిజెన్లు ఆరా తీస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆమె పేరు మంజూష ముక్కవిల్లి (Manjusha Mukkavilli) అని తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్లో ఆమె చాలా ఫేమస్. ఒకప్పటి లెజెండరీ నటీమణులు అయినటువంటి సూర్యకాంతం, ఛాయాదేవి, నిర్మలమ్మ..ల మేనరిజమ్స్ను ఇమిటేట్ చేస్తూ రీల్స్ చేస్తూ ఉంటుంది.

దర్శకురాలు నందినీ రెడ్డి స్వతహాగా సూర్యకాంతం గారి ఫ్యాన్ కావడంతో.. ఈమె రీల్స్ చూసి ఇంప్రెస్ అయ్యి మంజూషకి మెసేజ్ చేసిందట. సమంత బెస్ట్ ఫ్రెండ్ రోల్ కోసం ఆమెను 3 సార్లు ఆడిషన్ చేసిందట. నందినీ రెడ్డి సెలక్షన్ మంచిదే. సినిమాలో మంజూష చాలా బాగా చేసింది. కొన్ని సీరియస్ సిట్యుయేషన్స్ లో కూడా బాగా నవ్వించింది. సినిమా అయిపోయాక కూడా వెన్నెల కిషోర్ తో వచ్చే సన్నివేశంలో ఇంకా సహజంగా నటించింది. నిజానికి ఈ పాత్రకి పాపులర్ నటీమణులను ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు.

వేరే వాళ్ళు చేస్తే.. వాళ్ళ కెరీర్లో ఇదొక మంచి క్యారెక్టర్ అయ్యేదేమో. కానీ ఓ కొత్త ఫేస్ ని.. అందులోనూ మంజూష వంటి టాలెంటెడ్ ఫేస్ ని తీసుకోవడం వల్ల ఆడియన్స్ అంతా కిరణ్మయి పాత్రతో బాగా కనెక్ట్ అయ్యారు. ఆమెకు కూడా మంచి లైఫ్ దొరికింది అని చెప్పుకోవచ్చు. దర్శకుల ఆలోచనల నుండే పాత్రలు పుట్టాలి. నటీనటుల కోసం పాత్రలు రాసుకుంటే అవి ఈ రేంజ్లో ఇంపాక్ట్ చుపిస్తాయన్న గ్యారెంటీ లేదు.
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!














