సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా (Meena) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అవును.. నిజమే..! త్వరలో బీజేపీ పార్టీలో చేరనున్నారు మీనా. తమిళనాడులో బీజేపీ .. అన్నా డి ఎం కె పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా..వరుసగా సినిమా వాళ్ళని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఖుష్బూ ఆల్రెడీ బీజేపీ పార్టీలో ఉన్నారు.
మరోపక్క కమల్ హాసన్ (Kamal Haasan) కూడా అన్నా డి ఎం కె పార్టీలో చేరినట్టు ప్రచారం జరిగింది. ఇప్పుడు మీనా సైతం బీజేపీ పార్టీలో చేరినట్టు స్పష్టమవుతుంది. నటి ఖుష్బూ (Kushboo) సలహా మేరకు మీనా బీజేపీ పార్టీలో చేరబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. దీనిపై మరింత క్లారిటీ అయితే రావాల్సి ఉంది.
ఇక చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మీనా… తర్వాత ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత ‘చంటి’ (Chanti) ‘అల్లరి మొగుడు’ ‘సుందరకాండ’ ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ ‘ముఠామేస్త్రి’ (Muta Mestri) ‘అబ్బాయిగారు’ ‘అల్లరి అల్లుడు’ ‘సూర్యవంశం’ ‘మా అన్నయ్య’ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది.
2009 లో ప్రముఖ బిజినెస్మెన్ విద్యాసాగర్ ను వివాహం చేసుకున్నారు. సినిమాల తర్వాత మీనా చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంత గ్యాప్ తర్వాత ‘దృశ్యం’ (Drushyam) వంటి సినిమాల్లో నటించారు. అయితే 2022 లో మీనా (Meena) భర్త అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే.