అంజలి ప్రియుడిని బయటపెట్టిన ఛాలెంజ్
- February 11, 2017 / 01:17 PM ISTByFilmy Focus
తెలుగు నటి అంజలి కోలీవుడ్ సినిమాల ద్వారా పాపులర్ అయి తెలుగులోనూ హీరోయిన్ గా ఛాన్సులు అందుకుంది. విజయాలతో పాటు కుటుంబ సభ్యుల మధ్య గొడవలతో వార్తల్లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజులుగా మీడియాకి దూరంగా ఉంది. సరైనోడు చిత్రంలో బ్లాక్ బస్టర్ అంటూ చిందులేసిన అంజలి మరో తెలుగు చిత్రం సైన్ చేయలేదు. తాజాగా ఓ ఛాలెంజ్ ద్వారా ఆమె తో పాటు ఆమె ప్రేమ వ్యవహారం బయటికి వచ్చింది. వివరాల్లోకి వెళితే…. జ్యోతిక నటించిన మగళీర్ మట్టుం చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. దీంతో ఆ చిత్ర నిర్మాత, భర్త అయిన సూర్య ప్రచారానికి శ్రీకారం చుట్టూరు. అందులో భాగంగా దోశెల పోటీని పెట్టారు.
ముందుగా తన భార్య జ్యోతికకు దోశెలు వేయడం నేర్పించి, తాను వేసిన దోశెలను ఆమెకు తినిపించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా మీరు మీ భార్యలకు దోశెలు వేసి తినిపించి పోటీలో పాల్గొనాలంటూ పిలుపు నిచ్చారు. ఈ ఛాలెంజ్ లో జై పాల్గొని దోసెలు వేసి అంజలికి తినిపించారు. ఈ ఫొటోలను పోస్ట్ చేశారు కూడా. దీంతో జై, అంజలిల మధ్య ఉన్నదీ స్నేహం కాదు, ప్రేమ అని స్పష్టమయింది. జర్నీ మూవీలో వీరిద్దరూ ప్రేమికులుగా నటించారు. లైఫ్ జర్నీలో కలిసి నడవనున్నట్లు ఫోటో ద్వారా చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












