కర్నూల్లో జరగాల్సి ఈవెంట్ కి ప్రకృతి సహకరించకపోవడంతో!

  • September 12, 2019 / 05:37 PM IST

విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ.. “సైరా నరసింహా రెడ్డి” సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సెప్టెంబర్ 18న ఈ చిత్రం ఆడియో వేడుకను కర్నూల్ లో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ వేడుకలోనే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. అనంతరం తమిళ, మలయాళ, హిందీ వెర్షన్స్ కి సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్స్ ను కూడా నిర్వహించేందుకు టీం సన్నద్ధమవుతోంది. మెగాస్టార్ అభిమానులు మాత్రమే కాక.. యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

తొలుత ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ ను కర్నూలులో నిర్వహించాలని చూసినప్పటికీ.. అక్కడ పరిస్థితులతోపాటు ప్రకృతి కూడా అంతగా సహకరించకపోవడంతో.. వెన్యూ హైద్రాబాద్ కి మార్చినట్లు తెలుస్తోంది. ఎల్ బి స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకి మెగాస్టార్, పవర్ స్టార్, మెగాపవర్ స్టార్, స్టైలిష్ స్టార్, సుప్రీం హీరో వంటి మెగా హీరోలతోపాటు పలు ఇండస్ట్రీలకు చెందిన వారు కూడా పాలు పంచుకొనే అవకాశాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus