కీలక రోల్ పోషించనున్న అలనాటి హీరోయిన్
- November 23, 2016 / 09:23 AM ISTByFilmy Focus
అక్కినేని ప్రిన్స్ అఖిల్ హీరో గా నటించిన తొలి చిత్రం ‘అఖిల్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో తర్వాతి సినిమా చేయడానికి అఖిల్ చాలా సమయం తీసుకున్నారు. అనేక కథలు విన్న తర్వాత అక్కినేని ఫ్యామిలీకి “మనం” వంటి హిట్ మూవీ ఇచ్చిన విక్రమ్.కె.కుమార్ స్టోరీకి ఒకే చెప్పారు. ప్రస్తుతం ఈ డైరక్టర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. డిసెంబర్ లో అఖిల్ నిక్షితార్ధం జరిగిన తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ టబు కీలక రోల్ పోషించనున్నట్లు సమాచారం. టబు గతంలో కింగ్ నాగార్జున సరసన నిన్నే పెళ్లాడుతా మూవీలో నటించింది. అంతే కాదు అఖిల్ బేబీ గా ఉన్నప్పుడు చేసిన సిసింద్రీ సినిమాలోనూ ఓ పాటలో నాగ్ తో ఆడి పాడింది. ఇప్పుడు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా అడుగుపెడుతోంది. అది అఖిల్ చిత్రంతో కావడం గమనార్హం. అయితే ఆమె అఖిల్ కి అమ్మగా కనిపించనుందా, అత్తగా కవ్వించనుందా ? అనే విషయాన్నీ మాత్రం చిత్ర బృందం సీక్రెట్ గా ఉంచింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















