మెగాస్టార్ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ కి తరలి రానున్న టాలీవుడ్ అగ్ర తారలు
- November 22, 2016 / 07:14 AM ISTByFilmy Focus
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ కి ముహూర్తం కుదిరిపోయింది. చిరు హీరోగా నటిస్తున్న 150 వ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దాదాపు 80శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఖైదీ నంబర్ 150 మూవీ సంక్రాంతికి బరిలో దిగడానికి ముస్తాబు అవుతోంది. ఆ పండుగ కంటే ముందే ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించేందుకు చిత్ర నిర్మాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ వేడుకకు చిత్ర పరిశ్రమలోని అగ్ర తారలను ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, డైలాగ్ కింగ్ మోహన్ బాబు రావడం ఖాయమైనట్లు తెలిసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అల్లు అర్జున్, అల్లు శిరీష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. చిరుకి వీరాభిమానులైన మరికొంతమంది యువ హీరోలు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారని సమాచారం. ఇలా ఒకే వేదికపై పది మందికి పైగా టాలీవుడ్ హీరోలు కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ డ్యాన్సులతో అదరగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఖైదీ నంబర్ 150 మూవీ ఆడియో వేడుక అవార్డుల ప్రదానోత్సవాన్ని తలపించడం ఖాయం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















