Uday Kiran: ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది అని ఉదయ్ కిరణ్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు : వి.ఎన్.ఆదిత్య
- February 16, 2026 / 08:42 PM ISTByPhani Kumar
ఉదయ్ కిరణ్(Uday Kiran) అప్పట్లో ఓ సెన్సేషన్. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తక్కువ టైంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ‘చిత్రం’ ‘నువ్వు నేను’ ‘మనసంతా నువ్వే’ సినిమాలతో హ్యాట్రిక్ సక్సెస్..లు అందుకుని తన మార్కెట్ పెంచుకున్నాడు. ఆ తర్వాత అతను చేసిన సినిమాలు కొన్ని బాగా ఆడినా.. ‘మనసంతా నువ్వే’ రేంజ్లో సక్సెస్ అందుకోలేదు. అటు తర్వాత ఊహించని విధంగా అతని డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.
Uday Kiran
ఏది ఏమైనా అతను బ్రతికుంటే.. ఇప్పటికీ నితిన్ రేంజ్ క్రేజ్ ను ఆస్వాదించేవాడేమో.. కానీ 2014 లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఉదయ్ కిరణ్. అయితే ఉదయ్ కిరణ్ తో ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుల్లో తేజ తర్వాత వి.ఎన్.ఆదిత్య ఒకరు. ఇటీవల ‘మనసంతా నువ్వే’ రీ- రిలీజ్ అవ్వడంతో ఈయన మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

వి.ఎన్.ఆదిత్య మాట్లాడుతూ…” ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ కొట్టింది.. మన జోనర్ కథలకి మంచి డిమాండ్ వచ్చినట్టే.. కాబట్టి, మంచి ఫ్యామిలీ కథలు రాయండి అన్నగారు అని ఉదయ్ కిరణ్ నాకు అతను చనిపోయే ముందు వారం ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఏడాది అతను తీసిన మాస్ యాక్షన్ మూవీ ‘జై శ్రీరామ్’ ప్లాప్ అయ్యింది. అతని తప్పేం లేదు. ఆ సినిమా అప్పటికే చేసేశాడు కాబట్టి..!
కానీ ‘అత్తారింటికి దారేది’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఆ జోనర్ లో ఓ సినిమా చేద్దామని ఉదయ్ కిరణ్ చెప్పడం..అతని రియలైజేషన్ కి చిహ్నంగా చెప్పుకోవాలి.’పవన్ కళ్యాణ్ వంటి మాస్ హీరో ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సినిమా చేయడం.. అది ఇండస్ట్రీ హిట్ అవ్వడం.. మన లాంటి వాళ్లకి మంచి రోజులు వచ్చాయి” అని చెప్పినోడు సరిగ్గా 6 రోజులు తిరగకుండా బలవన్మరణానికి పాల్పడటం అనేది నాకు కోపం తెప్పిస్తుంది” అంటూ వి.ఎన్.ఆదిత్య ఆవేదన వ్యక్తం చేశారు.
















