Ustaad Bhagat singh : కేవలం 20 నిమిషాల్లోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డీల్.. ఎలా అయిందో తెలిస్తే షాక్ అవుతారు..?
- March 7, 2026 / 05:52 PM ISTByFilmy Focus Desk
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే పవర్ స్టార్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఎందుకంటే 2012లో విడుదలైన ‘గబ్బర్ సింగ్’ భారీ విజయాన్ని అందుకున్న ఇన్ని సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరి కాంబోలో మళ్లీ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు.
Ustaad Bhagat singh
ఈ చిత్రాన్ని మొదట మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, తరువాత తేదీని ముందుకు జరిపి మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు నిర్ణయించారు. సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రమోషన్లు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

దర్శకుడు హరీష్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం, సినిమా షూటింగ్ ప్రారంభ దశలోనే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఎడిట్ చేసి ఒక ప్రత్యేక ప్రివ్యూ వీడియోగా సిద్ధం చేశారు. ఆ విజువల్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రతినిధులకు చూపించగా, సినిమా మేకింగ్ స్టైల్ మరియు ప్రెజెంటేషన్ వారికి బాగా నచ్చిందట. దీంతో కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే ఓటీటీ హక్కులపై ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు. ఈ డీల్ విలువ సుమారు రూ.80 కోట్ల వరకు ఉండొచ్చని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక విడుదలకు ముందే ఈ స్థాయి వ్యాపారం జరగడం సినిమాపై ఉన్న భారీ క్రేజ్కు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఓవర్సీస్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవడంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత మళ్లీ ఈ కాంబో ఎలా మెప్పిస్తుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.















