Varanasi : నెట్టింట చక్కర్లు కొడుతున్న వారణాసి సీక్వెల్ రూమర్స్.. వార్తల్లో నిజమెంత ?
- March 27, 2026 / 12:12 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఎస్ ఎస్ రాజమౌళి – సూపర్ స్టార్ మహేష్ బాబు జోడీ. వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’పై సోషల్ మీడియాలో రోజుకో కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నారనే వార్త ఫ్యాన్స్లో మరింత హైప్ను పెంచుతోంది.
Varanasi
భారీ కాన్సెప్ట్, విస్తృతమైన కథా నేపథ్యం ఉండటంతో, ఈ కథను ఒకే భాగంలో చెప్పడం కంటే రెండు భాగాలుగా విడుదల చేయటం ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందని టాక్. ఇటీవలి కాలంలో భారీ కథలను పార్ట్స్గా చూపించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధించడం కూడా ఈ నిర్ణయానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాల అభిప్రాయం.

ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపించనున్నారట. టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, మైథాలజీ అంశాల మేళవింపుతో కథ సాగుతుందని సమాచారం. వారణాసి నగరం నుంచి అమెజాన్ అడవుల వరకూ విస్తరించే విజువల్ జర్నీ ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉండబోతుందట. కొన్ని సన్నివేశాల్లో మహేష్ బాబు శ్రీరాముడి రూపంలో కనిపిస్తారన్న టాక్ కూడా అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది.
దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్లో అంతర్జాతీయ టెక్నీషియన్లు పని చేస్తున్నారని తెలుస్తోంది. కథానాయికగా ప్రియాంక చోప్రా, కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. రాజమౌళి స్టైల్కు తగ్గట్టుగా ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్ పీక్లో ఉండబోతుందని అంచనా. అయితే ఈ సీక్వెల్ రూమర్స్పై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. అయినా, ఈ ప్రాజెక్ట్పై ఉన్న అంచనాలు మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. నిజంగా రెండు భాగాలుగా వస్తే, ‘వారణాసి’ తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుపైకి తీసుకెళ్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.













