త్రివిక్రమ్ గురించి వెంకటేష్ ఏమన్నారంటే ?
- March 31, 2017 / 08:09 AM ISTByFilmy Focus
సుధ కొంగర దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన గురు మూవీ ఈ రోజు రిలీజ్ అయి మంచి టాక్ సొంతం చేసుకుంది. నెస్ట్ వీక్ నుంచి వెంకీ తదుపరి సినిమా పనుల్లో బిజీ కానున్నారు. ఇప్పటివరకు పూరి జగన్నాథ్, క్రిష్ వెంకటేష్ కి స్టోరీ వినిపించారు. కథలు చెప్పిన వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. వెంకటేష్ తో ఇదివరకు త్రివిక్రమ్ కలిసి పనిచేశారు. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ మాటలను అందించారు. ఆ రెండు విజయం సాధించాయి. సో వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి ఆశ తీరే సమయం దగ్గరపడింది. త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నట్లు వెంకటేష్ తాజాగా మిత్రులకు చెప్పినట్లు తెలిసింది.
అది మల్టీ స్టారర్ మూవీ అనే సంగతిని కూడా బయట పెట్టారంట. వెంకటేష్ మహేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాణ్ తో కలిసి గోపాల గోపాల సినిమాలు చేశారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఎన్టీఆర్ తో సినిమా ఫైనల్ అయింది. ఇందులోనే వెంకటేష్ నటిస్తున్నట్లుగా వార్త నెట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వార్త నిజమైతే ఇద్దరి హీరోల అభిమానులకు పండుగే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















