4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు
- March 11, 2026 / 05:58 PM ISTByPhani Kumar
‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన ‘సాహో’ సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. అయితే హిందీలో ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది.
4 Years For Radhe Shyam
సో ఓకే..! ఆ సినిమాకి దక్కాల్సిన గౌరవం అయితే దక్కింది అనే చెప్పాలి. అటు తర్వాత ‘రాధే శ్యామ్'(Radhe Shyam) అనే పీరియాడిక్ లవ్ స్టోరీ చేశాడు ప్రభాస్. అప్పటికి ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న రాధా కృష్ణ కుమార్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

2020 లోనే విడుదల కావాల్సిన సినిమా ఇది. కానీ కోవిడ్ కారణంగా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తికాలేదు. అందువల్ల వాయిదా పడుతూ.. పడుతూ ఎట్టకేలకు 2022 మార్చి 11 న రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. కామన్ ఆడియన్స్ ఈ సినిమాకి పర్వాలేదు అనే టాక్ చెప్పారు. కొన్ని కంప్లయింట్స్ అయితే సినిమాలో లేకపోలేదు.
కథ బాగున్నప్పటికీ, కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ… కథనం అతుకులు అతుకులుగా ఉండటం, ప్రభాస్ నుండి ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్, మాస్ ఎలిమెంట్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అయ్యారు.అందువల్ల ప్రభాస్ అభిమానులు సైతం ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. ఓపెనింగ్స్ పర్వాలేదు అనే రేంజ్లో వచ్చినా.. మాస్ సెంటర్ ఆడియన్స్ ఈ సినిమాని ఔట్ రైట్ గా రిజెక్ట్ చేయడంతో డిజాస్టర్ గా మిగిలిపోయింది.
కానీ దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ని ప్రభాస్ ఫ్యాన్స్ తప్పుబట్టలేదు. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్ ను, ‘ది రాజాసాబ్’ దర్శకుడు మారుతీని ట్రోల్ చేసినట్టు.. రాధాకృష్ణ కుమార్ పై అయితే కోపం పెట్టుకోలేదు. అదొక్కటే అతనికి ‘రాధే శ్యామ్’ విషయంలో అతనికి జరిగిన మేలు అని చెప్పుకోవాలి. అయితే ఈరోజుతో ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయ్యి 4 ఏళ్ళు పూర్తికావస్తోంది. ధియేటర్లో ఎలా ఉన్నా.. ఓటీటీలో రిలీజ్ అయ్యాక.. ఈ సినిమాని కొంతమంది మెచ్చుకున్నారు.
















