Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?
- February 17, 2026 / 02:46 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ఆసక్తి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇప్పుడు అదే ఆసక్తి మరోసారి పీక్స్కు చేరింది. కారణం ట్రెండ్ సెట్టర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో మహేష్ సినిమా చేసే అవకాశాలపై వినిపిస్తున్న గుసగుసలు. గతంలో వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగినా, అప్పట్లో సరైన టైమింగ్ కుదరక ప్రాజెక్ట్ ఆగిపోయిందనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
Mahesh Babu
సందీప్ రెడ్డి వంగా పేరు చెప్పగానే రియల్, ఇంటెన్స్ ఎమోషన్స్ గుర్తుకొస్తాయి. అర్జున్ రెడ్డి తో హీరో క్యారెక్టర్ను కొత్త కోణంలో చూపించిన వంగా, అదే కథను బాలీవుడ్లో ‘కబీర్ సింగ్’ గా తెరకెక్కించి బాక్సాఫీస్ను షేక్ చేశారు. తన ప్రీవియస్ చిత్రం ‘యానిమల్’ తో ఆయన స్టైల్ ఏ స్థాయిలో పనిచేస్తుందో దేశమంతా చూసింది. ఎన్ని వివాదాలు వచ్చినా, వంగా సినిమాల చుట్టూ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

Sandeep Reddy
ప్రస్తుతం మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక ఆయన డేట్స్ ఖాళీ అవుతాయని సమాచారం. మరోవైపు వంగా ప్రభాస్తో ‘స్పిరిట్’ పై ఫోకస్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేలోపు వచ్చే గ్యాప్లో మహేష్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయితే గనుక, మహేష్ను ఇప్పటివరకు చూడని మాస్, ఇంటెన్స్ షేడ్లో చూపించే అవకాశం ఉందనే అంచనాలు ఫ్యాన్స్లో బలంగా ఉన్నాయి. క్లాస్ ఇమేజ్తో పాటు పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్కు పేరున్న మహేష్, వంగా డిజైన్ చేసే క్యారెక్టర్లో ఎలా కనిపిస్తారన్నది నిజంగా ఆసక్తికరం. అన్నీ అనుకున్నట్లే కుదిరితే 2027 లో ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. అప్పటివరకు ఈ కాంబో టాలీవుడ్లో హాట్ డిస్కషన్గా కొనసాగడంలో ఏ మాత్రం సందేహం లేదు.













