‘నా పేరు సూర్య’ సినిమా ట్యూన్స్ చర్చల్లో అల్లు అర్జున్
- July 18, 2017 / 11:14 AM ISTByFilmy Focus
‘దువ్వాడ జగన్నాథం’ తర్వాత అల్లు అర్జున్ రచయిత వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. శిరీషా శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా లో అల్లు అర్జున్ సోల్జర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ జోడీగా నటించే హీరోయిన్ కోసం వంశీ వేట కొనసాగిస్తుంటే .. అల్లు అర్జున్ మాత్రం తన సినిమాకు ఎటువంటి మ్యూజిక్ కావాలో విశాల్ – శేఖర్ తో కూర్చొని వివరిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకులు గతంలో వెంకటేష్ చింతకాయల రవి కి సంగీతాన్ని ఇచ్చారు. మళ్ళీ తొమ్మిదేళ్ల తర్వాత బన్నీ సినిమాకి ఇస్తున్నారు.
ట్యూన్స్ కంపోజ్ చేసే పనిలో దిగిపోయారు. ఈ సందర్భంగా ‘నీతో కలిసి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోను శేఖర్ షేర్ చేశారు. అల్లు అర్జున్ మాస్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ట్యూన్ ఇవ్వాలని శేఖర్, విశాల్ ని కోరినట్లు తెలిసింది. తమిళ నటుడు శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















