రజనీకాంత్, ప్రభాస్, హృతిక్ రోషన్ పై అభిమానం చాటిన అల్లు శిరీష్!
- September 15, 2017 / 10:29 AM ISTByFilmy Focus
ప్రతి ఒక్కరికీ అభిమానులుంటారు. ఆరాధ్యంగా కొలుచుకునే వారి చిత్రాలను, స్ఫూర్తినిచ్చే వారి బొమ్మలను తమ గదుల్లో పెట్టుకోవడం సహజం. అలాగే ఒక హీరో అయినప్పటికీ అల్లు శిరీష్ తన అభిమాన హీరోలు వీరే అంటూ చెప్పారు. అంతేకాదు వారి బొమ్మలను తన గదిలో పెట్టుకున్నట్లు చెప్పారు. ఆ ముగ్గురు ఎవరో కాదు సౌంత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్, ఇండియన్ స్టార్ ప్రభాస్, హాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. వీరు ముగ్గురు నటించిన కబాలి, బాహుబలి, క్రిష్ మూవీలోని పాత్రల బొమ్మలను తన డెస్క్ టాప్ పై పెట్టుకున్నారు. ఆ ఫోటోను గురువారం తన ట్విట్టర్లో పోస్ట్ చేసి.. “నా డెస్క్ మీద ప్రభాస్, రజినీకాంత్, హృతిక్ లు ఉన్నారు” అని ట్వీట్ చేశారు.
తనకి నచ్చిన హీరోలు చేసిన ఆ సినిమాలంటే తనకి బాగా ఇష్టమని వెల్లడించారు. దీనిని చాలామంది పాజిటివ్ గా తీసుకుంటుంటే.. మెగా ఫ్యాన్స్ కొంతమంది నెగటివ్ గా తీసుకుంటున్నారు. మెగా హీరోల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ అనేక గొప్ప చిత్రాలు ఉన్నప్పటికీ వారి గురించి ప్రస్తావించకుండా రజనీకాంత్, ప్రభాస్, హృతిక్ ఇస్తమంటూ చెప్పడం .. మెగా హీరోలను అవమానించినట్లేనని మండి పడుతున్నారు. ఈ ట్వీట్ మెగా అభిమానులకు, అల్లు అభిమానులకు మధ్య మరింత వైరం పెంచుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















