ఒకే కథతో చాలా సినిమాలు వస్తుంటాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా వేరుగా ఉండవచ్చు. అలాగే వాటి ఫలితాలు కూడా ఒకేలా ఉంటాయి అని చెప్పలేం. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే .. రీమేక్ సినిమాలు తీస్తున్నప్పుడు మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీస్తున్నప్పుడు దర్శకులు ఎన్నో జాగ్రత్తలు వహించాలి. అందులో ముందుగా ఏ సినిమాని అయితే రీమేక్ చేయాలని అనుకుంటున్నారో ఆ సినిమా రీమేక్ హక్కులను కొనుగోలు చేయాలి. ఆ తర్వాత ఏ రాష్ట్రంలో రీమేక్ చేయాలని అనుకుంటున్నారో అక్కడి జనాల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు వంటివి చేయాలి.
అప్పుడే ఆ కథలోని ఆత్మ అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత దానిని ఆడియన్స్ ఎంజాయ్ చేయగలిగితే అది సక్సెస్ ఫుల్ రీమేక్ అవుతుంది. అయితే బాలకృష్ణ (Balakrishna), వెంకటేష్ (Venkatesh).. లు హీరోలుగా ‘అశోక చక్రవర్తి’ ‘ధ్రువ నక్షత్రం’ వంటి సినిమాలు వచ్చాయి. ఇవి రెండూ కూడా 1989 జూన్ 29న రిలీజ్ అయ్యాయి. విచిత్రంగా ఈ 2 సినిమాలు ఒకేలా ఉండటం ఆ టైమ్ లో అందరికీ షాక్ ఇచ్చింది. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా ‘ఆర్యన్’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు రీమేక్ గా బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’ని రూపొందించారు.
ఎస్.ఎస్.రవిచంద్ర దీనికి దర్శకుడు. ఇందులో హీరో కుటుంబానికి దూరమవ్వడం.. తర్వాత ముంబైకి వెళ్లి మాఫియా డాన్ అవ్వడం.. తిరిగి సొంత ఊరికి వచ్చి కుటుంబానికి దగ్గరయ్యే టైంలో విలన్ అడ్డుపడటం.. ఆ టైంలో అతన్ని చంపి ఎండింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ‘ఆర్యన్’ కి అఫీషియల్ రీమేక్ గా తీసిన ఈ సినిమా ప్లాప్ అయ్యింది.
మరోపక్క 1989 జూన్ 29 నే వెంకటేష్ (Venkatesh) ‘ధ్రువ నక్షత్రం’ సినిమా కూడా వచ్చింది. ఇది ‘ఆర్యన్’ కి స్ఫూర్తితో రూపొందిన మూవీ అని చెప్పాలి. కానీ తెలుగు నేటివిటీకి తగ్గట్టు చాలా మార్పులు చేశారు. అయినప్పటికీ అదే కథ. వై.నాగేశ్వరరావు దీనికి దర్శకుడు. విచిత్రంగా ఈ సినిమా హిట్ అయ్యింది. ఇంకో విచిత్రం ఏంటంటే ‘అశోక చక్రవర్తి’ కి రైటర్స్ గా పనిచేసిన ‘పరుచూరి బ్రదర్స్’ ‘ధ్రువ నక్షత్రం’ కి కూడా రైటర్స్ గా వ్యవహరించడం.