చరణ్ పై ఎవ్వరూ ఊహించని కామెంట్ చేసిన యాంకర్ అనసూయ..!
- November 20, 2020 / 06:09 PM ISTByFilmy Focus
రాంచరణ్, అనసూయ.. పేర్లు చెప్పగానే అందరికీ ‘రంగస్థలం’ సినిమానే గుర్తొస్తుంది. ఆ చిత్రంలో చరణ్ కు అత్త పాత్రలో కనిపించింది అనసూయ. నిజానికి రంగమ్మత్త పాత్రకు మొదట సీనియర్ స్టార్ హీరోయిన్ రాశీని అనుకున్నారు దర్శకనిర్మాతలు. కానీ ఈ పాత్ర డ్రెస్సింగ్ ఆమెకు నచ్చకపోవడంతో ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చరణ్.. అనసూయను రిఫర్ చేసాడు. అప్పటికే ‘జబర్దస్త్’ తో ఓ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అనసూయ..
ఆ షో జడ్జి నాగబాబు ద్వారా మెగా ఫ్యామిలీకి దగ్గరయింది. అటు తరువాత సాయి తేజ్ హీరోగా తెరకెక్కిన ‘విన్నర్’ చిత్రంలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. అనసూయ ఇటీవల శ్రీముఖి నిర్వహిస్తున్న ‘ఉమెనియా’ షోకి గెస్ట్ గా విచ్చేసింది. అనసూయకు ముందు.. విష్ణుప్రియ, పునర్నవి, ఝాన్సీ వంటి వారు కూడా గెస్ట్ లుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. ఈ షోలో అనసూయకు ఓ ప్రశ్న ఎదురయ్యింది.

హుక్ అప్, కిల్, మ్యారేజ్ అనే పేర్లు చెప్పి నాగార్జున, సాయి తేజ్, రాంచరణ్ వంటి వారి పై తనకి కలిగిన అభిప్రాయాన్ని చెప్పాలని కోరింది. దానికి అనసూయ చాలా సేపు ఆలోచనలో పడింది. చివరికి ‘నాగ్ సర్తో హుక్ అప్, సాయి తేజ్ను చంపేస్తా.. నా చిట్టిబాబును పెళ్లి చేసుకుంటాను’ అంటూ ఆన్సర్ ఇచ్చి అందరినీ షాక్ కు గురి చేసింది అనసూయ.
Most Recommended Video
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?
ఈ 12 మంది ఆర్టిస్ట్ ల కెరీర్.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారానే మొదలయ్యింది..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

















