Bellamkonda Sreenivas: మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్
- April 26, 2024 / 09:12 PM ISTByFilmy Focus
సోషియో ఫాంటసీ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. కాకపోతే కథకి, కథనానికి… లాజిక్, వి.ఎఫ్.ఎక్స్ వంటివి పర్ఫెక్ట్ గా ఉండాలి. లేదు అంటే ఫలితం తేడా కొట్టేస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే సోషియో ఫాంటసీ అనేది సేఫ్ గేమ్ అని మన టాలీవుడ్ డైరెక్టర్స్ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది.2024 లో ఇప్పటివరకు చూసుకుంటే ‘హనుమాన్’ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అలాగే ఫిబ్రవరిలో వచ్చిన సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’, మార్చిలో వచ్చిన గోపీచంద్ ‘భీమా’ వంటి సినిమాలు కూడా సోషియో ఫాంటసీ టచ్ ఉన్నవే.
అవి సోసోగానే ఆడినా.. ప్లాపులతో సతమతమవుతున్న ఆ హీరోలకి కొంత హోప్స్ అయితే ఇచ్చాయి. అందుకే మెగాస్టార్ చిరంజీవి సైతం ‘విశ్వంభర’ వంటి సోషియో ఫాంటసీ మూవీలో నటిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) కూడా ఎంటర్ అయినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే.. బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు 3 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) దర్శకుడు సాగర్ చంద్ర (Saagar K. Chandra) దర్శకత్వంలో చేస్తున్న `టైసన్ నాయుడు` (Tyson Naidu) సెట్స్పై ఉంది.

మరోపక్క ‘చావు కబురు చల్లగా’ (Chaavu Kaburu Challaga) దర్శకుడు కౌశిక తో ‘కిష్కింద పురి’ (BSS11) అనే ఓ సినిమా చేయడానికి కూడా రెడీ అయ్యాడు. దీంతో పాటు లుధీర్ బైరెడ్డి అనే నూతన దర్శకుడితో ఓ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడట. ఇది రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుందని సమాచారం. ఈ 3 సినిమాలు ఏడాది గ్యాప్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయట.













