‘కోయిలమ్మ’ సీరియల్ నటుడిపై పోలీస్ కేసు!

‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తాగిన మత్తులో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో అతడిపై కేసు నమోదైంది. రాత్రివేళ ఇంటికొచ్చి లైంgikanగా వేధిస్తున్నాడంటూ శ్రీవిద్య అనే యువతి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. అమర్ తో పాటు ముగ్గురు ఆకతాయిలు, అమర్ గర్ల్ ఫ్రెండ్ స్వాతి తనపై దాడికి పాల్పడ్డారని శ్రీవిద్య ఆరోపించింది. అమర్, స్వాతిల కారణంగా తమకి ప్రాణహాని ఉందంటూ శ్రీవిద్యతో పాటు అపర్ణ అనే మరో యువతి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తమ వద్ద రూ.5 లక్షలు తీసుకున్నారని.. తిరిగి ఇవ్వమని అడిగితే దాడికి దిగారంటూ శ్రీవిద్య, అపర్ణలు ఆరోపిస్తున్నారు. అమర్ తాగి గొడవ చేశాడని శ్రీవిద్య ఆరోపిస్తున్నప్పటికీ.. వీరి మధ్య వ్యాపారపరమైన గొడవలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీవిద్య, స్వాతి, లక్ష్మీ అనే ముగ్గురు యువతులు కలిసి మణికొండలో బొటిక్ వ్యాపారం మొదలుపెట్టారు.

వ్యాపార లావాదేవీల్లో తేడాలు రావడంతో స్వాతి వ్యాపారం నుండి తప్పుకుంది. తనకు రావాల్సిన వస్తువులు, డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో స్వాతి బుధవారం రాత్రి నటుడు అమర్ తో కలిసి శ్రీవిద్య ఇంటికి వెళ్లి నిలదీసింది. గొడవ పెద్దది కావడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అమర్, స్వాతిలు కూడా కౌంటర్ కేసు పెట్టారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus