కోర్టుకు హాజరుకావాలని రంభకు నోటీసులు అందజేసిన పోలీసులు
- January 12, 2017 / 12:12 PM ISTByFilmy Focus
“ఆంటీ కూతురా.. ఆమ్మో అప్సర..” అంటూ మెగాస్టార్ చిరజీవితో స్టెప్పులేసిన హీరోయిన్ రంభ ప్రస్తుతం జీ తెలుగులో ఏబీసీడీ అనే డ్యాన్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తోంది. రియల్ అండ్ రీల్ లైఫ్ లో పరిస్థితి బాగాలేనప్పుడు ఈ షో ఆదుకుందని ఈ భామ సంతోషపడింది. అయితే అదే షో తన కొంప ముంచుతుందని అనుకోలేదు. అసలు విషయంలోకి వెళితే.. రంభ అన్న శ్రీనివాసరావు వివాహం హైదరాబాద్ కు చెందిన పల్లవితో జరిగింది. 2014 వరకు వారి కాపురం బాగానే ఉంది. ఆ తరువాత అత్తింటి వారు వేధిస్తున్నారంటూ పల్లవి అత్తామామలపై, భర్త పై, ఆడపడుచు రంభ పైనా నాంపల్లిలోని మూడో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అందరికీ సమన్లు అందజేశారు. వారు కోర్టుకు హాజరయ్యారు.
అయితే రంభ మొన్నటి వరకు కెనడాలో నివసించడంతో పోలీసులు సమన్లు ఇవ్వలేకపోయారు. ఇక రంభ 2010 లో కెనడాకు చెందిన ఇంద్రన్ పద్మనాభన్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య గొడవలు రావడంతో పిల్లల్ని తీసుకొని కొన్ని నెలలక్రితం చైన్నైకి వచ్చింది. జీ తెలుగు నుంచి ఆఫర్ రావడంతో షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ కి వస్తూ పోతోంది. ఈ విషయం టీవీ షో ద్వారా తెలుసుకున్న పోలీసులు డైరక్ట్ గా షూటింగ్ జరుగుతున్న పద్మాలయ స్టూడియోకి వెళ్లి రంభకు కోర్టు నోటీసులను అందించారు. వెంటనే న్యాయస్థానానికి హాజరు కావాలంటూ తెలిపారు. ఈ షాక్ నుంచి రంభ ఇంకా తెలుకోలేదని సమాచారం. ఆమె కోర్టుకు వెలుతారా? లేకుంటే వదినతో రాజీ చేయించుకుంటారో? తెలియాల్సి ఉంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.















