Kv Anudeep: వింత వ్యాధితో బాధపడుతున్న ‘జాతి రత్నాలు’ దర్శకుడు!

  • November 3, 2022 / 05:30 PM IST

పలు కామెడీ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ ను మొదలుపెట్టి.. ‘పిట్టగోడ’ అనే చిత్రంతో దర్శకుడిగా మారాడు కె.వి.అనుదీప్. మొదటి చిత్రం పెద్దగా ఆడకపోయినా రెండో చిత్రం ‘జాతి రత్నాలు’ మాత్రం మంచి దర్శకుడిగా అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ ఒక్క చిత్రంతో ఇతను యూత్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అటు తర్వాత శివ కార్తికేయన్ తో ‘ప్రిన్స్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి ఇండియా వైడ్ ట్రెండింగ్లో నిలిచాడు కానీ…

ఈ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ అనుదీప్ పేరు తమిళంలో కూడా మార్మోగింది. కామెడీ సినిమాలు తీస్తున్నప్పటికీ అనుదీప్ చాలా సీరియస్ గా ఉంటాడు. అందుకు ఓ కారణం కూడా ఉందని టాక్. అతను అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడట.ఈ విషయం స్వయంగా అనుదీప్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ.. “నాకు హైలీ సెన్సీటీవ్‌ పర్సన్‌ (హెచ్‌ఎస్‌పీ) అనే డిజార్డర్‌ ఉంది. ప్రతి ఒక్కరిలో ఈ డిజార్డర్‌ లక్షణాలుంటాయి కానీ అర్ధం చేసుకోలేరు.

నా శరీరంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో నేను ఈ వ్యాధి గురించి తెలుసుకున్నాను. నాకు గ్లూటెన్‌ పడడు..కాబట్టి కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్ర రాదు. ఏదైనా పళ్ల రసం తాగితే మైండ్‌ కామ్‌ అవుతుంది. ఈ డిజార్డర్‌ ఉన్న వారి సెన్సెస్‌ చాలా స్ట్రాంగ్‌గా పని చేస్తాయి.. ఎక్కువ కాంతి వంతమైన లైట్లు చూసినా, ఘాటైన వాసనలు తగిలినా తట్టుకోలేరు. ఈ వ్యాధి ఉన్నవారు.. చాలా త్వరగా అలసిపోతారు.

ఇది శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. దీని మీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిశోధించి.. ప్రస్తుతం అదే ఆహారం తీసుకుంటున్నాను.నాకు భవిష్యత్తులో హెచ్‌ఎస్‌పీ గురించి సినిమా తీసే ఆలోచన కూడా ఉంది. దాని వల్ల కొందరైనా హీల్‌ అవుతారనేది నా అభిప్రాయం” అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అనుదీప్.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus