Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?
- June 10, 2026 / 03:16 PM ISTByFilmy Focus Desk
తెలుగు సినిమా చరిత్రలోనే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ‘సమర సింహా రెడ్డి’ లాంటి సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాలో హీరో పాత్ర చిత్రణ, అందులో చూపించిన హీరోయిజం ఇప్పటికీ కొన్ని యాక్షన్ సినిమాలకు స్ఫూర్తి అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ విషయాన్ని యువ దర్శకులు కూడా చెబుతుంటారు. అందులోని రైల్వే స్టేషన్లో బాలకృష్ణ నడుచుకు వచ్చే సీన్ ఎఫెక్ట్ ఇప్పటికీ అలానే ఉంది. ఇదొక్కటే కాదు ఇలాంటి విషయలు చాలానే ఉన్నాయి.
Samarasimha Reddy
* ఇక ఈ సినిమాలోని హైలైట్ సీన్ అయిన స్టేషన్లో బాలయ్య రైలు దిగే సన్నివేశాన్ని వంగవీటి రంగా జీవితంలో జరిగిన ఓ సన్నివేశం స్ఫూర్తితో రాశారు.
* ఈ సినిమా కథకు తొలుత వెంకటేశ్ను హీరోగా అనుకున్నారట. కానీ ఆ పాత్రకు బాలయ్య అయితేనే బెటర్ అని ఫిక్స్ అయ్యారట. ఆయనకు తగ్గట్టు పాత్రను మార్చుకున్నారట.
* 1990లో తమిళంలో వచ్చిన ‘సింధూర పువ్వు’ సినిమాకు ఈ సినిమాకు కాస్త పోలిక ఉంటుంది. ఇందులోని ప్రాథమిక కథ పాయింట్ అందులోనూ కనిపిస్తోంది.
* తొలుత ఈ సినిమాలో హీరో ముంబయి బ్యాక్డ్రాప్ ఉన్న వాడిగా చూపిద్దాం అనుకున్నారట. ఆ తర్వాత రచయిత విజయేంద్ర ప్రసాద్ రాయలసీమ నేపథ్యంలోకి మార్చారట.

* 1999లో విడుదలైన ఈ సినిమా ఆ ఏడాది అత్యధి వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
* రూ. 6 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఐదు రెట్లు ఎక్కువ అంటే ఊ.30 కోట్ల వసూళ్లు అందుకుంది.
* ఈ సినిమా కథ ఓకే అవ్వడానికి ముందు దర్శకుడు బి.గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్ సుమారు 30 కథలు డిస్కస్ చేశారట.
* ఈ సినిమా 122 సెంటర్లలో 50 రోజులు.. 104 సెంటర్లలో 100 రోజులు ఆడింది.
* 29 సెంటర్లలో 175 రోజులుగా ఆడగా.. మూడు థియేటర్లలో 227 రోజులు ఆగింది.
* ఒక థియేటర్లో 365 రోజులు ఆడింది. అదే హైదరాబాద్ ముషీరాబాద్లోని గౌతమ్ థియేటర్.
* ఈ సినిమాకుగాను ఉత్తమ దర్శకుడుగా బి.గోపాల్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా రాంబాబు నం
ది అవార్డు అందుకున్నారు.
* ఇలా ఈ సినిమాలో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు రీరిలీజ్ అవుతోంది. ఇప్పుడెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.















