బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్కి వచ్చింది. నెట్ఫ్లిక్స్లో ఉన్న ఈ సిరీస్లో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, ప్రముఖ హీరో ఆమిర్ ఖాన్ అతిథులుగా కనిపించారు. సిరీస్ స్ట్రీమింగ్కి దగ్గరకు వస్తున్న సమయంలో ఈ ఇద్దరి గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ ప్రచారం కూడా చేశారు. అయితే ఆ రెండు పాత్రలు తొలుత అనుకున్నవి కావు. నిమిషాల్లో ఓకే అనుకుని రాసినవట. ఈ విషయంలో ఆ సిరీస్లో నటించిన హీరోయినే ఈ విషయం చెప్పుకొచ్చింది.
ఆమిర్ ఖాన్, రాజమౌళి సన్నివేశాన్ని ముందుగా ప్లాన్ చేసుకోలేదని, అప్పటికప్పుడు అనుకొని రాసినదని హీరోయిన్ అన్య చెప్పారు. అంతేకాదు దర్శకుడు ఆర్యన్ 20 నిమిషాల్లో రాశారని కూడా తెలిపారు. ముంబయిలోని ఓ స్టూడియోలో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతుండగా రాజమౌళి, ఆమిర్ వారి ప్రాజెక్ట్ల కోసం అక్కడికి వచ్చారని ఆర్యన్కు తెలిసిందట. వెంటనే తాను 20 నిమిషాల్లో ఒక సన్నివేశం రాస్తానని.. మీరు కాస్ట్యూమ్స్ మార్చుకోండి అని నటీనటుల్ని కోరారట. అలా వారు వెళ్లి వచ్చేసరికి ఆర్యన్ ఆ సీన్స్ రెడీ చేశారట.
అలా రాజమౌళి, ఎస్.ఎస్.రాజమౌళి ఈ సిరీస్లో భాగమయ్యారని నటి అన్య తెలిపింది. బాలీవుడ్లో తొలి ప్రయత్నంలోనే హిట్ కొట్టిన హీరో జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయన్న కథాంశంతో ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ రూపొందింది. ‘కిల్’ సినిమాతో ఇప్పటికే థ్రిల్ చేసిన లక్ష్య సెటిల్డ్ ఈ సిరీస్లో పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ఈ సిరీస్లో షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, ఇమ్రాన్ హష్మీ, సారా అలీఖాన్ కూడా మెరిశారు.