ఏకకాలంలో ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్న ఆదాయపు పన్ను అధికారులు
- November 11, 2016 / 12:01 PM ISTByFilmy Focus
కలక్షన్లు, అవార్డులతో గత కొంతకాలంగా నిత్యం వార్తల్లో నిలిచిన బాహుబలి ఈ రోజు మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఈ సారి బాహుబలి బ్రేకింగ్ న్యూస్ కావడం ఆ చిత్ర బృందం తో పాటు, టాలీవుడ్ ని షాక్ కి గురిచేసింది. తెలుగు ప్రజలు గర్వించతగ్గ సినిమాను నిర్మించిన నిర్మాతలు శోభు యార్లగ్డడ, ప్రసాద్ దేవినేని కార్యాలయాలు, ఇళ్లపై శుక్రవారం ఆదాయపన్ను అధికారులు రైడ్ కి వచ్చారు. మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.
నూటయాభై కోట్లతో బాహుబలి బిగినింగ్ ని నిర్మించగా ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లను వసూలు చేసి రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం 200 కోట్లతో బాహుబలి కంక్లూజన్ ని దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు ప్రీ బిజినెస్ పూర్తి చేసిన ఈ చిత్ర నిర్మాతలపై ఐటీ అధికారుల కన్ను పడింది. ఈ రోజు వారి ఇళ్లు, ఆఫీసుల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates















