జై లవ కుశ టీమ్ చలో గుజరాత్
- April 29, 2017 / 01:12 PM ISTByFilmy Focus
సినిమా ప్రారంభం మొదలు కావడం కాస్త ఆలస్యం అయింది కానీ.. షూటింగ్ లో లేట్ ఉండకూడదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ భావిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న జై లవ కుశ సినిమా రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ కి బాహుబలి సెలవులు ఇచ్చారు. అంటే యూనిట్ మొత్తం రాజమౌళి మలిచిన కళాఖండాన్ని చూసేలా వారం రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. వచ్చేనెల 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఈ షెడ్యూల్ గుజరాత్ లో జరగనుంది. అక్కడ కొన్ని కీలకసీన్లు షూట్ చేయనున్నారు.
ఈ చిత్రీకరణలో ఎన్టీఆర్ తో పాటు, హీరోయిన్లు రాశిఖన్నా, నివేదా థామస్, నందిత రాజ్ , తదితరులు కూడా పాల్గొననున్నారు. ఎండలు అదిరిపోతున్నప్పటికీ లెక్క చేయకుండా బాబీ గుజరాత్ వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఎలాగైనా సెప్టెంబర్ 1 చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ అందరూ గట్టి సంకల్పంతో ఉన్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో 55 కోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















