బూత్ బంగళాలో జై లవకుశ షూటింగ్
- May 12, 2017 / 07:24 AM ISTByFilmy Focus
ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్లో లవ కుమార్ పాత్రపై కొన్ని సీన్లు పూర్తి చేశారు. రెండు రోజుల క్రితం మొదలయిన షెడ్యూల్ ల్లో రెండో పాత్ర దారి జై పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం హైదరాబాద్ బూత్ బంగ్లాలో రావణాసురుడి పెద్ద సెట్ వేశారు. ఈ సెట్లో ఫైట్ తీస్తున్నారు. మాస్ ప్రేక్షకులు విజిల్స్ వేసే విధంగా ఈ ఫైట్ ఉంటుందని చిత్ర బృందం వెల్లడించింది.
మరో మూడు రోజుల పాటు ఇక్కడే షూటింగ్ జరగనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్, నందిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20 ) సందర్భంగా మే 19 వ తేదీ సాయంత్రం జై లవకుశ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















