పవన్ ని చూస్తూ డైలాగ్ మరచి పోయిన కీర్తి సురేష్
- May 18, 2017 / 12:53 PM ISTByFilmy Focus
నేను శైలజ మూవీతో కీర్తి సురేష్ తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. లేటైనా “నేను లోకల్” అంటూ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు హ్యాట్రిక్ అందుకోవడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 25 వ మూవీలో నటిస్తోంది. డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే త్రివిక్రమ్ కి కీర్తి కోపం తెప్పించింది. ఎందుకంటే డైరక్టర్ యాక్షన్ చెప్పగా కీర్తి డైలాగ్ చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ ని చూస్తూ ఉండిపోయిందంట. త్రివిక్రమ్ ఎంత అరిచినా వినిపించుకోలేదని చిత్ర బృందం తెలిపింది.
దీంతో త్రివిక్రమ్ కి కోపం వచ్చిందని.. ఆమెను మందలించబోతుండగా పవన్ కళ్యాణ్ కల్పించుకొని శాంతిపజేసినట్లు వెల్లడించింది. రెండు సినిమాలకే స్టార్ హీరో తో నటించే అవకాశం అందుకోవడంతో ఆనందంలో ఉన్న కీర్తికి, పవన్ ని చాలా క్లోజ్ గా చూసేసరికి సిగ్గుతో మాటలు రాలేదని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు. ఈ సినిమాలో కీర్తి తో పాటు అను ఇమ్మానియేల్ తో పవన్ రొమాన్స్ చేయనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి గోకుల కృష్ణుడు అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















