ఆ హీరోతో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న కీర్తి సురేష్
- August 21, 2017 / 11:01 AM ISTByFilmy Focus
మలయాళంలో వరుసవిజయాలు అందుకున్న కీర్తి సురేష్ కోలీవుడ్ లో అడుగుపెట్టి రజనీమురుగన్, రెమో, భైరవ సినిమాలతో విజయాలను సొంతం చేసుకుంది. తెలుగులోనూ నేను శైలజ, నేను లోకల్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు పవన్, త్రివిక్రమ్ సినిమాతో పాటు సావిత్రి బయోపిక్ లోను నటిస్తోంది. రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన కీర్తి ఆసక్తికర సంగతులు వెల్లడించింది. తాను చిన్నప్పటి నుంచి హీరోయిన్ గా కావాలని కలలు కన్నానని, అది నిజమైందని ఆనందం వ్యక్తం చేసింది. అలాగే తన అభిమాన హీరోలైన ధనుష్, విజయ్లతో కలిసి నటించే కోరిక తీరిందని, సూర్యతో తానాసేర్నం కూటం చిత్రంలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉన్నట్లు వివరించింది.
“నాకు ఇష్టమైన హీరోల్లో అజిత్ ఒకరు. ఆయనంటే చాలా ఇష్టం. ఆయనతో నటించాలన్న కోరిక ఉంది. అయితే అజిత్ తో నటించడమే లక్ష్యంగా ప్రయత్నాలేవీ చేయను, అలాంటి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను” అని స్పష్టం చేసింది. అత్యధిక సక్సస్ రేట్ తో దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో లక్కీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి అజిత్ కి జోడీగా నటించే సమయం దగ్గరలోనే ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













