ఒక వీకెండ్ సినిమా వాళ్ల జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అంటే ఆ వీకెండ్లో వచ్చే వారి సినిమా ఫలితం బట్టే నెక్స్ట్ ఏంటి అనేది చెప్పొచ్చు. ఇలా వారంతం చాలామంది కెరీర్ని అంతం చేసేసింది అంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి పరిస్థితి ఎక్కువగా దర్శకులకే వస్తుంటుంది. వారిలో కొంతమంది ఆ పరిస్థితిని దాటి ముందుకొచ్చి.. తిరిగి హిట్ ట్రాక్ ఎక్కితే.. ఇంకొంతమంది అక్కడదితో కెరీర్ని ముగించేస్తుంటారు. మరికొందరు ముగిసిపోయింది అనుకున్న కెరీర్ని తిరిగి ఏళ్ల తర్వాత నిలబెట్టుకున్నళ్లు ఉన్నారు. వాళ్లని హీరోలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఓ హీరో మహేష్బాబు.పి.
‘రారా కృష్ణయ్య’ అంటూ 2014లో సందీప్ కిషన్తో కలసి వచ్చిన దర్శకుడు మహేష్బాబు.పి. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర దారుణమైన ఫలితం పొందింది. దీంతో పరిశ్రమలో మళ్లీ కనిపించలేదు. అయితే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో రీఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్యలో ఏం జరిగింది అనేది ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. ‘రారా కృష్ణయ్య’ సినిమా కథ మహేష్ది కాదు. ఏ లైఫ్ లెస్ ఆర్డినరీ అనే సినిమా ఆధారంగా రాసుకున్న కథ ఆ సినిమా. ఆ సినిమా హాలీవుడ్లోనే బాగా ఆడలేదు. ఇక్కడ ట్రై చేస్తే వర్కవుట్ అవుతుందేమో అని కూడా ఇక్కడా ఆడలేదు.

రామ్ పోతినేనితో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే సినిమా చేశారు మహేష్బాబు.పి. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వస్తే.. ‘రారా కృష్ణయ్య’ సినిమా టాపిక్ వచ్చింది. అప్పుడు ఆయన మాట్లాడుతూ మెచ్యూరిటీ లేని వయసులో తీసిన సినిమా అది. ఏదోలా డైరెక్టర్ అయిపోవాలనే ఆలోచనతో అలా చేశా. ఆ సినిమా నాకు చాలా విషయాలు నేర్పింది. నన్ను నేను కొత్తగా సిద్ధం చేసుకునే అవకాశం ఇచ్చింది అని మహేష్బాబు.పి చెప్పారు. ఇప్పుడు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మీద భారీ ఆశలతో ఉన్నారాయన.
