చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సంచలన కామెంట్స్ చేసిన మణిశర్మ
- May 24, 2017 / 09:43 AM ISTByFilmy Focus
మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్టార్ హీరోలకు అద్భుతమైన ఆల్బమ్స్ ఇచ్చారు. తన నేపథ్య సంగీతంతో విజయాలను తెచ్చి పెట్టారు. కొంతకాలంగా అవకాశాలు లేక సినెమాలకు దూరంగా ఉన్న మణిశర్మ తాజాగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమాకి సంగీతమందించారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ లపై సంచలన కామెంట్స్ చేశారు. “చూడాలనివుంది’ చిత్రంలో ‘రామ్మ చిలకమ్మా’ పాట మొదట్లో చిరంజీవికి నచ్చలేదు. ఆ పాట సినిమాలో పెట్టవద్దని సూచించారు.
కానీ నేను ఆ పాటను యూనిట్ సభ్యులకు వినిపించాను. అందరూ బాగుంది అని చెప్పడంతో చిరు ఓకే చెప్పారు” అని ఆనాటి సంగతిని బయటపెట్టారు. చిరు వద్దన్న పాటే ఆ సినిమాలో సూపర్ హిట్ పాటగా నిలిచిందని మెగాస్టార్ ని పరోక్షంగా విమర్శించారు. అలాగే తీన్ మార్ , ఖలేజా వంటి సినిమాల్లో పాటలు జనాలకు నచ్చకపోవడానికి కారణం తాను కాదని మహేష్, పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. వారి ఇష్టం ప్రకారమే ట్యూన్స్ ఇవ్వడం వల్ల అవి ఆకట్టుకోలేక పోయాయని తప్పంతా ఆ హీరోలపై మణిశర్మ నెట్టేశారు. ఈయన మాటలకు చిరు, మహేష్, పవన్ ఏమంటారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














