మహేష్, మురుగదాస్ సినిమాలో కీలక పాత్రలో నటించిన నమ్రత
February 14, 2017 / 09:29 AM IST
|Follow Us
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోత్కర్ తాను సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన కొన్నిరోజుల్లోనే మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ చేస్తున్న ద్విభాషా చిత్రంలో నమ్రత కీలకరోల్ చేయనున్నట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. నమ్రత మహేష్ కలిసి వంశీ సినిమాలో నటించారు. అనంతరం వారిద్దరూ పెళ్లిచేసుకోవడంతో నమ్రత ఇంటికే పరిమితమయ్యారు. మొన్న మీడియాతో తాను సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆ చిత్రం సూపర్ స్టార్ సినిమా కావడం ఫ్యాన్స్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. సంభవామి అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ చిత్రంలో ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా మహేష్ బాబు నటిస్తున్నారు.
ఈ చిత్రం ఇప్పటికే 80 శాతం షూటింగ్ జరుపుకుంది. ఇప్పుడు ముంబై లో భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. దాదాపు నెలరోజులపాటు సాగే ఈ షెడ్యూల్ తో టాకీ పార్టీ పూర్తి అవుతుంది. ఇందులో హీరోయిన్ గా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అందాలను ఆరబోయనుంది. సెకండ్ హీరోయిన్ రోల్ నమ్రత పోషిస్తోందని సమాచారం. వెండితెరపైన పదేళ్ల తర్వాత మహేష్, నమ్రత రొమాన్స్ చూసే అవకాశం లభిస్తుందని అభిమానులు సంబరపడిపోతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.