ఇండియన్ సినీ పరిశ్రమలో టాప్ ఆర్డర్ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) పేరు కూడా ఉంటుంది. గతంలో ఆయన తీసిన సినిమాలు అలాంటివి. ‘ఇద్దరు’ (Iddaru) ‘రోజా’ (Roja) ‘నాయగన్’ ‘దళపతి’ (Thalapathi) ‘గీతాంజలి’ ‘సఖి’ ఇలా ఏదైనా తీసుకోండి. అది క్లాసిక్ అంతే..! ఆయన సినిమాల్లో సైలెన్స్ కూడా చాలా ఎమోషన్ పండిస్తూ ఉంటుంది. అలాగే మణిరత్నంకి మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. ఈయన సినిమాలకి ఎక్కువగా ఇళయరాజా, రెహమాన్ వంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు.
మిగిలిన దర్శకులకి ఎలా ఉన్నా.. మణిరత్నం సినిమాలకి వీళ్ళు పది రెట్లు డ్యూటీ చేసేవారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈ లెజండరీ దర్శకుడితో పనిచేయడానికి స్టార్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఒకానొక టైంలో మహేష్ బాబు (Mahesh Babu) సైతం.. తాను మణిరత్నం దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. మణిరత్నం రేంజ్ గురించి చెప్పాలంటే.. సింపుల్ గా ఇది.
కానీ ఇప్పుడు.. ఆయనతో సినిమాలు చేయడానికి యంగ్ హీరోలు కూడా భయపడి వెనకడుగు వేస్తున్న పరిస్థితి. ఇటీవల మణిరత్నం తెరకెక్కించిన ‘థగ్ లైఫ్’ (Thug Life) రిలీజ్ అయ్యింది. కమల్ హాసన్ తో (Kamal Haasan) ఆయన 37 ఏళ్ళ తర్వాత చేసిన సినిమా ఇది. సినిమా మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బయ్యర్స్ కి భారీ నష్టాలు తప్పేలా లేవు. మరోపక్క నవీన్ పోలిశెట్టితో ఓ మూవీ చేయాలని మణిరత్నం ప్రయత్నించారు. అందుకు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) కూడా మొదట ఓకే చెప్పారు.
కానీ ఎందుకో కథ పై నవీన్ కి నమ్మకం కుదరలేదు. పైగా ఆ క్యారెక్టర్ కి కూడా నవీన్ తన ఇమేజ్ సెట్ అవ్వదు అని భావించాడట. ఓ తెలుగు నిర్మాత ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి రెడీ అయ్యారు. కానీ ‘థగ్ లైఫ్’ రిజల్ట్ చూశాక ఆ నిర్మాత వెనకడుగు వేసినట్టు తెలుస్తుంది. దీంతో నవీన్ కూడా సేఫ్ అయినట్టు స్పష్టమవుతుంది. ఇప్పుడు నవీన్ ప్లేస్ లో శింబు (Silambarasan) ఈ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.