బాహుబలి తరవాత రాజమౌళి మూవీ అది కాదు
- January 23, 2017 / 06:14 AM ISTByFilmy Focus
ప్రపంచ సినీ అభిమానులు ఎదురుచూస్తున్న బాహుబలి కంక్లూజన్ కి తుది రూపు ఇచ్చే పనిలో దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బిజీగా ఉన్నారు. ఏప్రిల్ 28 న ఈ చిత్రం రిలీజ్ కావాలని క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఈ మూవీ తర్వాత జక్కన్న మహా భారతం సినిమా చేయనున్నారని, ఆ కథను రాసే పనిలో రచయిత విజయేంద్ర ప్రసాద్ ఉన్నారని కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొట్టాయి. జక్కన్న భారతాన్ని తీస్తే శ్రీ కృష్ణుడి పాత్రలో నటించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ స్పష్టం చేయడంతో ఈ వార్తలకు బలం వచ్చాయి. అయితే ఈ వార్తలని కథకుడు, జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఖండించారు.
బాహుబలి తర్వాత రాజమౌళి మహా భారతం చేయడం లేదని స్పష్టం చేశారు. నిన్న ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “నేను ఇప్పుడు మహా భారత స్క్రిప్ట్ ని రాయడం లేదు. నేను రాస్తుండగా ఎవరైనా చూసారా?” అని ప్రశ్నించారు. కనీసం రాజమౌళి మహా భారతం గురించి తనతో చర్చించలేదని చెప్పారు. ఈ విషయంపై వస్తున్న రూమర్లను నమ్మవద్దని సూచించారు. ప్రస్తుతం రాజమౌళి దృష్టంతా బాహుబలి పై మాత్రమే ఉందని, దీని తర్వాత కథను ఇంకా ఏదీ అనుకోలేదని వివరించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















