ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మెహ్రీన్ కౌర్!
- April 29, 2017 / 07:57 AM ISTByFilmy Focus
ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తర్వాత బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే రాశీ ఖన్నా, నివేతా థామస్ హీరోయిన్లుగా ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా హంస నందిని కూడా స్పెషల్ రోల్ పోషిస్తోంది. మరి మూడో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ని తీసుకున్నారా? అని అనుకోకండి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ నటించేది జై లవ కుశలో కాదంట. ఎన్టీఆర్ 28 మూవీలో అని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఎన్టీఆర్ జైలవకుశ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తున్నారు.
దీని తర్వాత ఎన్టీఆర్ ప్రాజక్ట్ పట్టాలెక్కించనున్నారు. అందుకోసం ఇప్పుడే ఆ సినిమాలో ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోందని సమాచారం. మెహ్రీన్ కౌర్ ప్రస్తుతం రవితేజతో ‘రాజా ది గ్రేట్’ మూవీ చేస్తోంది. దీనితో పాటు శర్వానంద్-మారుతిల సినిమాలో, మంజుల డైరెక్షన్లో సుందీప్ కిషన్ చేయనున్న సినిమాలో అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్ అయింది. మెహ్రీన్ కౌర్ నటనకు వస్తున్న ఫీడ్ బ్యాక్ ని అనుసరించి త్రివిక్రమ్ ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















