ఎన్టీఆర్ మూడు క్యారెక్టర్స్ ని రివీల్ చేసిన చిత్ర బృందం
- August 26, 2017 / 07:45 AM ISTByFilmy Focus
వినాయకుడి పండుగ ఎన్టీఆర్ అభిమానుల్లో మరింత ఆనందాన్ని నింపింది. బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశలోని మూడో పాత్ర కుశ లుక్ ని నిన్న చిత్ర బృందం రిలీజ్ చేసింది. ట్రెండీ లుక్ తో అదరగొట్టారు. తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నఇందులోని నెగటివ్ క్యారక్టర్ అయిన జై కి సంబంధించిన టీజర్ గత నెల విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. అతను చెడ్డోడుగా పేరు తెచ్చుకోగా.. రెండో పాత్ర లవ కుమార్ మంచోడిగా టీజర్ తో స్పష్టమయింది. మూడో క్యారక్టర్ ఎలా ఉంటాడో అనే ఫ్యాన్స్ అంచనాలకు మించి బాబీ డిజైన్ చేయించాడు.
హుషారైన వ్యక్తిగా, డబ్బుకోసం ఏదైనా చేయగల దైర్యవంతుడిగా కుశ కనిపించబోతున్నట్లు పోస్టర్లు స్పష్టం చేశాయి. లుక్ లో జై లవ లను మించి పోయాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మూడు పాత్రలకు జోడీగా నివేత థామస్, రాశీ ఖన్నా, నందిత రాజ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ విలన్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















