Mathrubhumi: సల్మాన్ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?
- July 14, 2026 / 06:07 PM ISTByFilmy Focus Desk
ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో, అపూర్వ లాఖియా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మాతృభూమి’. తొలుత ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే పేరు పెట్టి మార్చేశారు అనుకోండి. ఎందుకో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఈ సినిమా మరోసారి వాయిదా పడిన మేటర్ గురించి చూద్దాం. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా వస్తుందని చెప్పిన ఈ సినిమాను ఆగస్టు 15 నాటికి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఆ డేట్ నుండి ఏకంగా కొత్త క్యాలెండర్లోకి వెళ్లిపోయింది అని చెబుతున్నారు.
Mathrubhumi
సినిమా విడుదలకు మరో నెల రోజులే టైమే ఉంది కదా అంటూ ఈ సినిమా విడుదలపై ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఈ సినిమా విడుదల వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమాలోని కొంత కంటెంట్ విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో మార్పులు, చేర్పులు చేయాల్సి వస్తుందని, అందుకే రిలీజ్ ఆలస్యమవుతోందని సల్మాన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
భారత్ – చైనా మధ్య 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గల్వాన్ లోయలో మన సైన్యానికి, చైనా సైన్యానికి మధ్య జరిగిన భీకర ఘర్షణను సినిమాగా తీస్తున్నారు. దీంతో ఆ రోజు గల్వాన్లో ఏం జరిగిందో చూద్దాం అని జనాలు వెయిట్ చేయడం మొదలుపెట్టారు. ఈ లోపు సినిమా పేరు ‘మాతృభూమి’ అని మార్చేశారు. మామూలు సినిమా అయితే ఈ పట్టింపు ఉండేది కాదు.. మన దేశ సైన్యం వీరత్వాన్ని, సంఘటనను తెలిపేలా ఉన్న టైటిల్ను మార్చడమే దీనికి కారణం.
ఈ సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా చైనా మీడియా కొన్ని విమర్శలు చేసిన విషయం ఇప్పుడు గుర్తు చేస్తున్నారు నెటిజన్లు. చైనాపై వ్యతిరేకతను రెచ్చగొట్టేందుకు నాటి ఘటనను సినిమాలో వక్రీకరిస్తున్నారంటూ అక్కడి మీడియా తన అక్కసు వెళ్లగక్కింది. ఈ సినిమా జాతీయవాద మెలో డ్రామా అని కూడా అంది. ఈ నేపథ్యంలో టైటిల్ మార్పు కీలకంగా మారింది.
ఇక ఈ సినిమాలో సల్మాన్ పోషిస్తున్న పాత్ర తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కర్నల్ సంతోష్ బాబు అని అంటున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న అపూర్వ లాఖియా ఈ విషయంలో సంతోష్ బాబు కుటుంబంతో మాట్లాడారు అని ఓ టాక్ కూడా ఉంది. కాబట్టి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరే.











