ఎన్నాళ్లు నాన్చుతావు దిల్ రాజు…అంటూ పవన్ ఫ్యాన్స్ ఫైర్..!
- February 24, 2020 / 07:28 PM ISTByFilmy Focus
పింక్ రీమేక్ షూటింగ్ మొదలయ్యి దాదాపు రెండు నెలలు కావస్తుంది. మరో మూడు నెలల్లో సినిమా విడుదల కానుంది. మే లో వేసవి కానుకగా పవన్ కమ్ బ్యాక్ మూవీ పింక్ రీమేక్ విడుదల కానుంది. దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటిసారి లాయర్ రోల్ చేస్తున్న ఈ చిత్రం సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. పెద్దల పలుకుబడి కారణంగా వేధింపులకు గురైన ముగ్గురు యువతులను పవన్ చట్ట పరంగా ఎలా కాపాడాడు అన్నదే కథాంశం.

కాగా ఈ చిత్ర హీరోయిన్ ఎవరనేది ఇంత వరకు ప్రకటించలేదు. పవన్ రెండేళ్ల తర్వాత చేస్తున్న సినిమాలో ఆయనకు జత కట్టే హీరోయిన్ ఎవరనే విషయంలో వారికి విపరీతమైన ఆతృత నెలకొని ఉంది. కానీ ఇంత వరకు అధికారికంగా హీరోయిన్ ఎవరనేది దిల్ రాజు ప్రకటించలేదు. ఇది పవన్ అభిమానులను అసహనానికి గురిచేస్తుంది. అసలు సినిమా మిగతా నటులు మరియు టైటిల్ గురించి అప్డేట్స్ ఇవ్వకపోడం వారి కోపానికి కారణం అవుతుంది. ఇప్పటికే పవన్ ని వెండి తెరపై చూసి రెండేళ్లు దాటిపోయింది. కనీసం మూవీ విడుదల వరకు అప్డేట్స్ తో కాలక్షేపం చేద్దాం అని చూస్తున్న ఫ్యాన్స్ కి పింక్ దర్శకనిర్మాతల తీరు ఆగ్రహం తెప్పిస్తుంది.
Most Recommended Video
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!
















