Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!
- May 17, 2025 / 10:25 PM ISTByPhani Kumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటివరకు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. వాస్తవానికి సినిమాలు చేసే మూడ్ కూడా ఇప్పుడు ఆయనకు లేదు. కానీ 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీని నిలబెట్టడానికి, బలోపేతం చేయడానికి ఆయనకి డబ్బులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో ఆయనకు వ్యాపారాల రీత్యా ఎటువంటి ఆదాయం లేకపోవడం వల్ల తిరిగి సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు. అలా దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో ‘వకీల్ సాబ్’ (Vakeel Saab) , ఏ.ఎం.రత్నం (AM Rathnam) బ్యానర్లో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu, ‘మైత్రి’ బ్యానర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh), ‘సితార’ బ్యానర్లో ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak), ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్లో ‘బ్రో'(BRO), డీవీవీ దానయ్య (D. V. V. Danayya) బ్యానర్లో ‘ఓజి’ (OG Movie) వంటి సినిమాలు చేయడానికి సైన్ చేశారు.
Pawan Kalyan

వీటిలో ‘హరిహర వీరమల్లు’ ‘ఓజి’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప అన్ని సినిమాలు కంప్లీట్ అయ్యాయి.రిలీజ్ అయ్యాయి. వీటికి కూడా డేట్స్ ఇచ్చినా మేకర్స్ సరిగ్గా వాడుకోలేకపోయారు అంటూ పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత పవన్ మళ్ళీ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇక ఏదైతే ఏమైంది అని ఈ 3 సినిమాలకి కూడా మోక్షం కలిగించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు.

ఈ క్రమంలో అన్ని సినిమాలు కంప్లీట్ అవ్వడానికి కావాల్సిన డేట్స్ ఇచ్చేశారు. అయితే వీటికి గాను పవన్ కళ్యాణ్ కి రావాల్సిన బ్యాలెన్స్ పారితోషికాలు ‘ఇప్పుడు వద్దు’ అన్నట్లు చెప్పారని లేటెస్ట్ టాక్. అయితే ఈ సినిమాలు కంప్లీట్ అయ్యి.. రిలీజ్ టైం కి వచ్చిన లాభాల్లో వాటా ఇవ్వాలని పవన్ చెప్పారట.
















