వంద సినిమాలు నిర్మించడమే లక్ష్యంగా … నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ (People Media Banner ) సంస్థ. కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ‘ఎం.ఎల్.ఎ’ (MLA) (మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి) సినిమాతో వీరి ప్రయాణం మొదలైంది. అటు తర్వాత ‘గూఢచారి’ (Goodachari) ‘సిల్లీ ఫెలోస్’ ‘ఓ బేబీ’ (Oh! Baby) ‘వెంకీ మామ’ (Venky Mama) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) ‘ధమాకా’ (Dhamaka) వంటి విజయవంతమైన సినిమాలు అందించారు. అయితే కొలాబరేషన్ లో చేసిన సినిమాలు అన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. కానీ ఆ తర్వాత సోలో నిర్మాతలుగా మారి చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్స్ అయ్యాయి.
భారీ నష్టాలు తెచ్చిపెట్టాయి. దీంతో ఇప్పుడు వీళ్ళ చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ప్రస్తుతం ‘పీపుల్ మీడియా’ వారి చేతిలో ప్రభాస్ (Prabhas) ‘ది రాజాసాబ్’ (The Rajasaab ) , తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్’ (Mirai) , సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) ‘తెలుసు కదా’ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. వీటిపై టార్గెటెడ్ ఆడియన్స్ దృష్టి ఉంది. ఈ సినిమాల అప్డేట్స్ కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కూడా. ముఖ్యంగా ‘ది రాజాసాబ్’ రిలీజ్ డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఫైనల్ గా ఆ సినిమా రిలీజ్ డేట్ ను డిసెంబర్ 5 కి ఫిక్స్ చేసినట్లు ప్రకటించేశారు. అలాగే టీజర్ ను జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలిపారు. అంతేకాదు ‘తెలుసు కదా’ సినిమాని కూడా అక్టోబర్ 17న రిలీజ్ అవుతుందని ఓ వీడియోతో ప్రకటించారు. ఇక ‘మిరాయ్’ ని సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే. ఇవి అనౌన్స్ చేసిన డేట్లకి వస్తాయా? లేదా? అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి ట్రోలర్స్ బారి నుండి తప్పించుకుని రిలాక్స్ అయినట్టే..!