మొన్నీమధ్య వరకు ఉద్యోగాల విషయంలో ఎక్కువగా వినిపించిన వర్కింగ్ అవర్స్ చర్చ.. ఇప్పుడు సినిమా పరిశ్రమల్లోకి వచ్చింది. పని గంటల విషయంలో మా నిర్ణయం మాది.. అనే చర్చ మొదలైంది. దీనంతటి కారణం ‘స్పిరిట్’(Spirit) సినిమా నుండి దీపిక పడుకొణె (Deepika Padukone) తప్పుకోవడం / సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) తప్పించేయడం. ఇందులో ఏం జరిగిందో చెప్పలేం కాబట్టి రెండూ రాశాం. ఈ క్రమంలో ‘ఎంత సేపు పని చేయాలి?’ అనే చర్చ మెల్లగా మొదలైంది. ఈ క్రమంలో ప్రముఖ కథానాయిక రాధికా ఆప్టే (Radhika Apte) చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.
‘రక్తచరిత్ర,‘లెజెండ్’ (Legend) ‘లయన్’ (Lion) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు రాధికా ఆప్టే పరిచయం. అంతకంటే ఎక్కువగా తనదైన శైలిలో చేసిన వెబ్సిరీస్లతోనే ఎక్కువ పరిచయం. ఆ విషయం వదిలేస్తే.. రీసెంట్గా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం బాలీవుడ్కే పరిమితమైన రాధికా ఆప్టే ఇటీవల తల్లి అయ్యింది. అయితే పిల్లలు పుట్టిన వారం తర్వాతే షూటింగ్కి వచ్చేసింది. ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు కూడా. సినిమాపట్ల ఆమె నిబద్ధతకు ఇదో నిదర్శనం అని మాట్లాడారు.
ఇప్పడు ఆమె వర్క్ (సినిమా షూటింగ్లు), మాతృత్వం బ్యాలెన్స్ చేయడం గురించి మాట్లాడింది. పని – పిల్లలు బ్యాలెన్స్ కష్టమని రాధిక చెప్పింది. సినిమాల్లో పని చేయడం చాలా కష్టం, మనం ఎన్ని గంటలు షూటింగ్ చేస్తామో.. అంత సేపు పిల్లల్ని చూసుకోలేం. కాబట్టి దీనికి పరిష్కారం కనుక్కోవాలి అని అంది. ఇక్కడ ఆమె దీపిక పేరును ప్రస్తావిచంకపోయినా.. ఆమె ఉద్దేశం అదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభాస్ (Prabhas) – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా నుండి దీపిక పని గంటలు కారణంగానే తప్పుకుంది అని సమాచారం.
రోజుకు 8 గంటల షిఫ్ట్ పని చేయడానికి దీపిక ఓకే చెప్పలేదట. దీంతో ఆ పనికి పారితోషికం ఎక్కువని భావించి సందీప్ వంగా అండ్ టీమ్ దీపికను తప్పించింది అంటారు. ఆ తర్వాతనే ఆ ప్లేస్లోకి త్రిప్తి డిమ్రి (Tripti Dimri) వచ్చింది. ఇక బాలీవుడ్లో ఇలాంటి విషయాల గురించి మాట్లాడటానికి చాలామంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్లేమన్నా బయటకు వస్తారేమో చూడాలి.