Mahesh Babu: ‘పోకిరి’ వల్లే నేను సూపర్ స్టార్ అయ్యాను.. ట్రోలింగ్ ఎఫెక్ట్ మహేష్ పై గట్టిగానే పడింది
- February 4, 2026 / 12:07 PM ISTByPhani Kumar
ఇటీవల ‘వారణాసి’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. రిలీజ్ ఇంకా ఏడాది పైనే టైమ్ ఉంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది కూడా..! ఈ సినిమాని పాన్ వరల్డ్ మూవీగా ఇంటర్నేషనల్ వైడ్ రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్. టైటిల్ లాంచ్ ఈవెంట్ జరిగిన వెంటనే… అంతర్జాతీయ వేదికలపై భారీగా ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా హీరో మహేష్ బాబు(Mahesh Babu), హీరోయిన్ ప్రియాంకా చోప్రా, విలన్ పృథ్వీరాజ్ సుకుమారన్..లతో ఇంటర్నేషనల్ మీడియాతో ఓ ఇంటర్వ్యూ ఏర్పాటు చేశాడు.
Mahesh Babu
విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఆ ఇంటర్వ్యూని విడుదల చేశారు. ఇక ఇందులో మహేష్ బాబు ‘పోకిరి’ గురించి ప్రస్తావించడం స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. మహేష్ బాబు మాట్లాడుతూ…’పోకిరి’ నన్ను సూపర్ స్టార్గా మార్చిన సినిమా. నా కెరీర్లో అది టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. నిజం చెప్పాలంటే ప్రతి సినిమా నన్ను ఎంతో కొంత మారుస్తూ వస్తోంది. కానీ ‘పోకిరి’ మాత్రం నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టింది.

2006లో విడుదలైన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ‘పోకిరి’ సక్సెస్ నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే.. ఆ సినిమా తర్వాత నేను కొంతకాలం నెక్స్ట్ ఎలాంటి సినిమాతో ప్రేక్షకులను అలరించాలి అనే కన్ఫ్యూజన్ కి గురయ్యాను” అంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు మహేష్ బాబు. అయితే మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘పోకిరి’ సినిమా గురించి మహేష్ బాబు ప్రస్తావించలేదు.
మిగిలిన అన్ని సినిమాల గురించి మాట్లాడాడు. తర్వాత తీరిగ్గా ట్వీట్ వేసి కవర్ చేయాలని చూశాడు. దీంతో మహేష్ బాబుని అభిమానులే పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అటు తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ రిలీజ్ టైమ్లో.. ‘నేను ఫ్లాప్స్ లో ఉంటే మహేష్ బాబు నన్ను పట్టించుకోడు’ అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో.. పూరిదే తప్పని అంతా గుర్తించారు.
అయినప్పటికీ ట్రోలింగ్ ఎఫెక్ట్ అనేది మహేష్ బాబు పై గట్టిగానే పడిందని లేటెస్ట్ కామెంట్స్ తో అర్దం చేసుకోవచ్చు. ‘వారణాసి’ టైటిల్ లాంచ్ వేడుకలో కూడా టీమ్ అంతా ‘పోకిరి’ భజన చేసిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ తో పాటు కవల పిల్లలకి జన్మనిచ్చిన నటులు వీరే













