సాహో సినిమాకు రెమ్యూనరేషన్ తీసుకోని ప్రభాస్!
- May 28, 2017 / 08:32 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ కి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు వచ్చినా తోసి పుచ్చి.. డబ్బు కన్నా నాకు స్నేహితులే ముఖ్యమని ప్రభాస్ చాటారు. తన మిత్రులైన వంశీ, ప్రమోద్ బ్యానర్ యువీ క్రియేషన్స్ లో సినిమా చేయడానికి అంగీకరించారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కానుంది. 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ ఫిలిం కోసం భారీ రెమ్యునరేషన్ ప్రభాస్ అందుకోనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
అందులో వాస్తవం లేదని తెలిసింది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఒక పైసా కూడా తీసుకోవడం లేదు. ప్రస్తుతమున్న క్రేజ్ కి తగినట్టుగా పారితోషికం ఇస్తామని యూవీ క్రియేషన్స్ వారు చెప్పినా, వారు స్నేహితులు కావడంతో ప్రభాస్ తిరస్కరించారని సమాచారం. సినిమా లాభాల్లో వాటా ఇస్తామని చెప్పడంతో ప్రభాస్ ఒప్పుకున్నాడని తెలిసింది. షేర్ విధానంలో తన స్నేహితులకు రిస్క్ తగ్గుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















