Natti Kumar: పవన్ రాజకీయాలపై నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్!
June 21, 2023 / 10:46 PM IST
|Follow Us
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కాకినాడలో ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ పై ఆరోపణలు చేయగా చంద్రశేఖర్ రెడ్డి కూడా పవన్ కు ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ వ్యవహారంలోకి తల దూర్చారు.
ఈ సందర్భంగా ముద్రగడ్డ పద్మనాభం మాట్లాడుతూ ఉద్యమం చేపట్టడానికి తాను కోట్ల రూపాయల ప్యాకేజీ తీసుకోలేదంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఒక నాయకుడు మాదిరి కాకుండా వీధి రౌడీలా మాట్లాడుతున్నారు అంటూ ముద్రగడ్డ పద్మనాభం పవన్ కళ్యాణ్ పై విమర్శలు కురిపించారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ పద్మనాభం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మధ్య ఈ వార్ జరుగుతూ ఉండగా నిర్మాత (Natti Kumar) నట్టి కుమార్ స్పందించారు.
ఈ సందర్భంగా నట్టి కుమార్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ ద్వారంపూడి మధ్య వివాదం జరుగుతున్న సమయంలో మధ్యలో ముద్రగడ్డ పద్మనాభం ఎందుకు వచ్చారో తనకు అర్థం కావడం లేదని తెలిపారు.ఇక ద్వారంపూడి పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ తన ఫ్లెక్సీలు కూడా కాకినాడలో కట్టనివ్వనంటూ విమర్శలు చేయడం సరి కాదని ఇది తన ఎమ్మెల్యే అహంకారానికి నిదర్శనం అని నట్టి కుమార్ తెలిపారు.
ఇక ఈ విషయంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా స్పందించాల్సిన అవసరం ఉందని ఈయన తెలిపారు.ఇక రాజకీయపరంగా పవన్ కళ్యాణ్ ఎంచుకున్న మార్గం చాలా సరైనదని ఆయన ఇదే మార్గంలో కనుక పయనిస్తే తప్పకుండా సీఎం అవుతారని మనమందరం కూడా పవన్ కళ్యాణ్ కోసం సపోర్ట్ చేయాలి అంటూ నట్టి కుమార్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.