Ram Charan: టీమిండియా ప్లేయర్స్ ను కలిసిన చరణ్!
- September 26, 2022 / 07:40 PM ISTByFilmy Focus
ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచ్ ఆడడానికి హైదెరాణదు వచ్చిన ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేయర్స్ లో కొందరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు తెలియడంతో చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. చరణ్ రేంజ్ ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చరణ్ అసిస్టెంట్స్ లో ఒకరు హార్థిక్ పాండ్యాతో ఫొటో దిగారు. దాన్ని ట్విట్టర్ లో షేర్ చేయడంతో విషయం బయటకొచ్చింది.
హార్థిక్ పాండ్యాతో పాటు సూర్య కుమార్ యాదవ్ అలానే మరికొంతమంది భారత క్రికెటర్లు రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు రామ్ చరణ్ షేర్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతానికైతే.. హార్థిక్ పాండ్యా ఫొటో మాత్రమే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో చరణ్ క్రేజ్ బాగా పెరిగింది. నార్త్ ఆడియన్స్ కు ఆయన బాగా దగ్గరయ్యారు. ఈ సినిమాతోనే ఇండియన్ క్రికెటర్స్ లో కొంతమంది రామ్ చరణ్ కి అభిమానులుగా మారి ఉంటారు.

సూర్య కుమార్ యాదవ్ అయితే రామ్ చరణ్ కి వీరాభిమాని అని ప్రచారం జరుగుతుంది. తన అభిమాన హీరోని కలుసుకోవడం కోసమే అతడు చరణ్ ఇంటికి వెళ్లారని అంటున్నారు. మొత్తానికి రామ్ చరణ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే..

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత కన్నడ దర్శకుడితో సినిమా చేయనున్నారు చరణ్.
కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

















